ETV Bharat / state

భూత వైద్యుడు చెప్పాడని.. పాపకు పాలివ్వకుండా చంపేసింది!

author img

By

Published : May 3, 2020, 11:21 AM IST

4 months baby died
పాలు పట్టక.. పాడె కట్టారు

ఏ తల్లి అయినా... తాను పస్తులుండైనా బిడ్డల కడుపు నింపాలనుకుటుంది. ఏపీలోని విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళ మాత్రం తల్లి ప్రేమకు మచ్చ తెచ్చేలా వ్యవహరించింది. మూఢ నమ్మకాలతో 4 నెలల పాపకు పాలివ్వకుండా వారంపాటు ఏడిపించింది. చివరికి ఆ చిన్నారి ప్రాణం విడిచింది.

ఏపీలోని విశాఖ మన్యం జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ జాగేరులో దారుణం జరిగింది. మూఢ నమ్మకాలతో 4 నెలల చిన్నారిని చంపుకుంది ఓ తల్లి. చిన్నారికి దోషం ఉందని పాలిస్తే తల్లికి మరణ గండం ఉందంటూ ఓ భూత వైద్యుడు చెప్పిన మాటలను ఆమె నమ్మింది. ఏడు రోజుల పాటు పసిపాపకు పాలు ఇవ్వడం మానేసింది. గుక్క పెట్టి ఏడుస్తున్నా ఆమె మనసు కరగలేదు. చిన్నారి ఏడుపు విన్న సమీప బంధువు... చిన్నారి తల్లిదండ్రులను మందలించాడు. భార్య దగ్గరికి తీసుకెళ్లి పాలు పట్టిస్తుండగా శిశువు మృతి చెందింది.

ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్​జోన్ జిల్లాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.