ETV Bharat / state

ఏపీలో కొత్తగా మరో 179 మందికి కరోనా, 4 మరణాలు

author img

By

Published : Jan 14, 2021, 8:19 PM IST

ఏపీలో కొత్తగా మరో 179 మందికి కరోనా సోకింది. తాజాగా వైరస్ బారిన పడి నలుగురు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్​లో పేర్కొంది.

ఏపీలో కొత్తగా మరో 179 మందికి కరోనా, 4 మరణాలు
ఏపీలో కొత్తగా మరో 179 మందికి కరోనా, 4 మరణాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 41,671 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 179 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,85,616కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

మొత్తం మరణాల సంఖ్య 7,138కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 219 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. వీరితో కలిపి ఏపీలో కోలుకున్నవారి సంఖ్య 8,76,000కి చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో 2,338 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇదీ చూడండి: జాయ్​రైడ్స్​లో యువత... రెండో రోజు ఉత్సాహంగా పోటీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.