కరోనా బారి నుంచి ప్రజలందరినీ రక్షించాలని సీతారామచంద్రులను కోరినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్వామివారిని దర్శించుకున్నారు. కొవిడ్-19 ప్రభావంతో అతి కొద్ది మంది సమక్షంలోనే వేడుకలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
ఇవీచూడండి: నేడే భద్రాద్రి రామయ్య కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షణ