ETV Bharat / state

Lockdown: పకడ్బందీగా లాక్‌డౌన్‌... రోడ్డెక్కితే జరిమానే!

author img

By

Published : Jun 7, 2021, 5:17 PM IST

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్​డౌన్​ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో అనవసరంగా రోడ్డెక్కె వాహనాదారులకు జరిమానాలు విధిస్తున్నారు.

 lockdown in adilabad
lockdown in adilabad

ఆదిలాబాద్‌లో పోలీసులు లాక్‌డౌన్‌ (Lockdown)ను కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల (Checkpost) వద్ద ఎస్పీ రాజేశ్ చంద్ర వాహనాల తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత బయటకు వచ్చిన వాహనాదారులకు జరిమానాలు విధించారు.

రోడ్డెక్కుతోన్న వాహనాలకు అనుమతి ఉందా? లేదా అనే విషయాన్ని పరిశీలించి ఆధారాలు చూపిన వారిని మాత్రమే గమ్యస్థానాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు ఎస్పీ. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఆ జిల్లాల్లో అక్రమ క్వారీలపై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.