ఆదిలాబాద్ రిమ్స్ బోధన ఆసుపత్రిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కరీంనగర్ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో తనిఖీలు కొనసాగించారు. హాజరు పట్టిక, ఇతర దస్త్రాలను పరిశీలించారు.
ఉపకార వేతనాల మంజూరులో సిబ్బంది అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. అధికారులు కోరినట్లుగా.. ఆయా దస్త్రాలను వారికి అప్పగించినట్లు డైరెక్టర్ బలరాం తెలిపారు.
ఇవీ చదవండి: కొత్త పరిశ్రమలకు ఊతం.. స్థలాల ఎంపికకు సర్కార్ ఆదేశం