ETV Bharat / state

రాం​లీలా మైదానంలో ఆదివాసీల భారీ బహిరంగసభ

author img

By

Published : Dec 9, 2019, 6:18 PM IST

soyam bapurao
soyam bapurao

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ తెలంగాణ ఆదివాసీలు దిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణ ఆదివాసీల ఐక్య సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భారీగా ఆదివాసీలు పాల్గొన్నారు.

రాజ్యాంగ ప్రక్రియ జరగకుండా అన్యాయంగా ఎస్టీల జాబితాలో లంబాడీలను చేర్చారని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. లంబాడీలను తొలగిస్తేనే ఆదివాసీలకు రావాల్సిన రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అందుతాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని బాపురావు డిమాండ్ చేశారు.

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ దిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రత్యేక రైలులో దిల్లీ చేరుకున్న ఆదివాసీలతో రాంలీలా మైదానం కిటకిటలాడింది.

'లంబాడీలను అక్రమంగా ఎస్టీ జాబితాలో చేర్చారు.. తొలగించండి'

ఇదీ చూడండి: లంచం తిరిగి ఇప్పించిన కలెక్టర్... వీఆర్వో, వీఆర్‌ఏ సస్పెన్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.