రాజ్యాంగ ప్రక్రియ జరగకుండా అన్యాయంగా ఎస్టీల జాబితాలో లంబాడీలను చేర్చారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. లంబాడీలను తొలగిస్తేనే ఆదివాసీలకు రావాల్సిన రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అందుతాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని బాపురావు డిమాండ్ చేశారు.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ దిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రత్యేక రైలులో దిల్లీ చేరుకున్న ఆదివాసీలతో రాంలీలా మైదానం కిటకిటలాడింది.
ఇదీ చూడండి: లంచం తిరిగి ఇప్పించిన కలెక్టర్... వీఆర్వో, వీఆర్ఏ సస్పెన్షన్