ETV Bharat / sports

Bhavina Patel:​ టీటీ ఫైనల్లో భవీనాబెన్​.. స్వర్ణంపైనే గురి

author img

By

Published : Aug 28, 2021, 7:36 AM IST

Updated : Aug 28, 2021, 11:40 AM IST

టోక్యో పారాలింపిక్స్​లో (Paralympics) భారత టేబుల్​ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్​ (Bhavina Pate).. ఫైనల్​కు దూసుకెళ్లింది. సెమీస్​లో చైనా ప్లేర్​ మియావో జాంగ్​పై 3-2 తేడాతో విజయం సాధించింది.

Bhavina Patel
భవీనాబెన్ పటేల్

భారత టేబుల్​ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్​ పటేల్ (Bhavina Pate)​ మరో అద్భుత ప్రదర్శన చేసింది. పారాలింపిక్స్​ (Paralympics) టీటీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్​లో వరల్డ్​ నంబర్​ త్రీ ప్లేయర్​, చైనా ప్యాడ్లర్​ మియావో జాంగ్​పై 3-2తో గెలుపొందింది.

శనివారం జరిగిన సెమీస్​ మ్యాచ్​ను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 తేడాతో గెలుపొందింది భవీనా. ఆదివారం జరగనున్న ఫైనల్​ పోరులో వరల్డ్​ నంబర్​ వన్​ సీడ్​, చైనా ప్లేయర్​ యింగ్​ ఝోతో తలపడనుంది.

పారాలింపిక్స్​ తొలి ప్రయత్నంలోనే భవీనా ఆకట్టుకుంది. ఫైనల్​ చేరిన తొలి భారత టీటీ ప్లేయర్​గా రికార్డు సృష్టించింది. ఇక స్వర్ణమే లక్ష్యంగా భవీనా తుదిపోరుకు సిద్ధమైంది.

ఇదీ చదవండి: Bhavina Patel: పోలియోను దాటి.. పారాలింపిక్స్​ పతకం ఖాయం చేసి

Last Updated :Aug 28, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.