టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు బంగారు పతకం గెలిస్తే టీమ్లోని తమ ప్లేయర్లకు ఒక్కొక్కరికి రూ. 2.25కోట్ల నజరానా ఇస్తామని పంజాబ్ క్రీడామంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి శుక్రవారం ప్రకటించారు. గతంలో హాకీ టీమ్ బంగారు పతకం సాధిస్తే మొత్తం జట్టుకు రూ. 2.25 కోట్లు ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా ఆ మొత్తాన్ని ఒక్కొక్క ప్లేయర్కు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.
పంజాబ్ భవన్లో జరిగిన యూత్ డెవలప్మెంట్ బోర్డు సమావేశానికి హాజరైన రాణాసోధి మీడియాతో మాట్లాడారు. పంజాబ్ నుంచి ఉన్న మొత్తం 20 మంది ఆటగాళ్లలో.. హకీ టీమ్ఇండియాలో 11 మంది టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన అన్నారు. అందుకుగానూ వారిని అభినందించారు. ఈ ఒలింపిక్స్లో కనీసం భారత్కు 3 నుంచి 4 పతాకాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఒలింపిక్స్లో సింధు రికార్డు.. తొలి క్రీడాకారిణిగా!