ETV Bharat / sports

'భారత్​కు శనిలా తగిలావు'.. అంపైర్​పై ట్రోల్స్

author img

By

Published : Nov 1, 2021, 10:41 AM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా న్యూజిలాండ్(ind vs nz 2021)​తో జరిగిన మ్యాచ్​లో ఓడిపోయింది టీమ్ఇండియా. అయితే ఈ మ్యాచ్​లో భారత్ ఓడిపోవడానికి అంపైర్ కూడా కారణమట. అతడుంటే భారత్ అస్సలు మ్యాచ్ గెలవదట. మరి అదేంటో చూసేయండి.

richard Kettleborough
రిచర్డ్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా న్యూజిలాండ్​(ind vs nz 2021)తో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలైంది టీమ్ఇండియా. అయితే ఈ మ్యాచ్​కు అంపైరింగ్ చేసిన రిచర్డ్ కెటిల్​బరో(richard kettleborough vs india)కు భారత జట్టు ఓటమికి సంబంధం ఉందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అతడి వల్లే టీమ్ఇండియా ఓడిపోయిందని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అందుకు కారణం రిచర్డ్ తప్పుడు అంపైరింగ్ కాదు. అతడు అంపైరింగ్ చేసిన ప్రపంచకప్​ నాకౌట్ మ్యాచ్​ల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడమే అందుకు కారణం.

ఇదీ కథ?

రిచర్డ్ కెటిల్​బరో 2014 టీ20, 2015 వన్డే, 2016 టీ20, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్​ల్లో భారత్ ఆడిన నాకౌట్ మ్యాచ్​లకు అంపైరింగ్ చేయగా.. ఇందులో అన్నింటిలోనూ ఓడిపోయింది టీమ్ఇండియా. అలాగే ఆదివారం న్యూజిలాండ్​తో జరిగిన పోరులోనూ కెటిల్​బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్ కూడా ఓటమిపాలైంది ఇండియా. దీంతో ఈ అంపైర్​పై ట్రోల్స్​తో విరుచుకుపడుతున్నారు అభిమానులు. 'మా జట్టుకు శనిలా దాపురించావు అంటూ' కామెంట్లు పెడుతున్నారు.

ముందుగా ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేయగలిగింది.​ హార్దిక్ (23), జడేజా (26) పర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో 14.3 ఓవర్లలోనే మ్యాచ్​ను ముగించేసింది కివీస్. మిచెల్ 49 పరుగులతో తృటిలో అర్ధశతకం చేజార్చుకోగా.. విలియమ్సన్​ (33*) చివరి వరకు నాటౌట్​గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇవీ చూడండి: టీమ్ఇండియా సెమీస్ అవకాశాలు చేజారినట్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.