ETV Bharat / sports

టీమ్ఇండియా బౌలింగ్ దళంపై మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Oct 29, 2021, 3:46 PM IST

team india
టీమ్​ఇండియా

టీమ్​ఇండియా జట్టులో బ్యాటర్లు మాత్రమే ఉంటే సరిపోదని వికెట్లు తీసే స్పిన్నర్లు కూడా ఉండాలని మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar News) అభిప్రాయపడ్డాడు. ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్(IND vs NZ T20) జరగనున్న నేపథ్యంలో టీమ్​ఇండియా బౌలింగ్ దళంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా తొలి మ్యాచ్​లో టీమ్​ఇండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచింది పాకిస్థాన్. ఈ మ్యాచ్​లో భారత ఫాస్ట్​ బౌలర్లతో సహా స్పిన్నర్లు కూడా పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్​ దళంపై సందేహాలు మొదలయ్యాయి. కాగా.. ఆదివారం న్యూజిలాండ్​తో తలపడేందుకు టీమ్​ఇండియా(IND vs NZ T20 Match) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ బ్యాట్స్​మన్ సంజయ్ మంజ్రేకర్.

"టీమ్​ఇండియాలో బ్యాటర్లు మాత్రమే ఉంటే సరిపోదు. మేటి స్పిన్​ బౌలర్లు కూడా ఉండాలి. మ్యాచ్​లో వారు వికెట్లు పడగొట్టాలి. అలాంటి వారినే జట్టులోకి తీసుకోవాలి."

-సంజయ్ మంజ్రేకర్, మాజీ ఆటగాడు.

పాక్​తో జరిగిన మ్యాచ్​లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా ఒక్క వికెట్​ కూడా పడగొట్టలేకపోయారు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ 33 పరుగులు ఇవ్వగా.. జడేజా 28 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్​తో జరగాల్సిన మ్యాచ్​లో రవిచంద్రన్​ అశ్విన్​కు చోటు కల్పిస్తే బాగుంటుందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం అశ్విన్​కు బాగా ఉందని టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఇటీవలే పేర్కొన్నాడు. ఐపీఎల్​లో డెత్​ ఓవర్లలోను అతడు బౌలింగ్ చేశాడని గుర్తుచేశాడు.

ప్రస్తుతం కివీస్​ను ఓడించి టీ20 ప్రపంచకప్​ ఆశలను పదిలం చేసుకోవాలని టీమ్​ఇండియా ఆశిస్తోంది.

ఇదీ చదవండి:

T20 World Cup 2021: రొనాల్డోలా వార్నర్​.. నవ్వులు పూయిస్తూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.