ETV Bharat / sports

Olympics: ఒలింపిక్స్ గోల్డ్​కు రూ.6 కోట్లు- సీఎం ప్రకటన

author img

By

Published : Jul 8, 2021, 10:38 PM IST

Olympics
ఒలింపిక్స్

ఒలింపిక్స్​లో పతకాలు సాధిస్తే భారీగా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్ ప్రకటించారు​. ఈ మెగాక్రీడల్లో పాల్గొననున్న తమ రాష్ట్ర అథ్లెట్స్..​ యువతకు దిక్సూచిగా మారారని ప్రశంసించారు.

ఒలింపిక్స్​లో పతకాలు సాధించే తమ రాష్ట్ర అథ్లెట్లకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించారు ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​. స్వర్ణపతక విజేతకు రూ.6 కోట్లు, రజతానికి రూ.4 కోట్లు, కాంస్యానికి రూ.2.5 కోట్లు నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు. తమ రాష్ట్రం నుంచి ఈ మెగాక్రీడలకు వెళ్లే ప్రతి క్రీడాకారుడికి రూ.15 లక్షలు నగదు ఇస్తామని పేర్కొన్నారు.

తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్​లో పాల్గొననున్న అథ్లెట్లు ద్యుతి చంద్​, ప్రమోద్​ భగత్​, దీప్​ గ్రేస్​ ఎక్కా, నమితా టొప్పొ, బిరేంద్ర లక్రా, అమిత్​ రోహిదాస్​ను ప్రశంసించారు పట్నాయక్​. వీరంతా తమ రాష్ట్ర యువతకు రోల్​ మోడల్​గా నిలిచారని అన్నారు. వీరంతా పతకాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

Olympics: ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్​

Olympics: ఒలింపిక్స్​ ప్రారంభానికి కొద్దిరోజులే.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.