ETV Bharat / sports

'రానున్న ఏడాదిపాటు భారత అథ్లెట్లకు కష్టకాలమే'

author img

By

Published : Jun 24, 2020, 10:11 AM IST

రానున్న కొన్నినెలలు అథ్లెట్ల పరిస్థితి క్లిష్టంగా ఉండబోతుందని చెప్పిన ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా.. టోక్యో ఒలింపిక్స్​​కు దాదాపు 125మంది క్రీడాకారుల్ని పంపిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

nareendar
నరీందర్​ బత్రా

వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్​కు దేశం తరఫున 125మంది అథ్లెట్లను పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు భారత ఒలింపిక్​​ సంఘం అధ్యక్షుడు (ఐఓఏ) నరీందర్ బత్రా. ఒలింపిక్స్ డే(జూన్ 23) సందర్భంగా కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్​​ నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలనపై దిగ్గజ క్రీడాకారులు లియాండర్​ పేస్​, ఒలింపిక్ విజేత అభినవ్​ బింద్రా, మాజీ క్రికెటర్ అంజూ బాబీ జార్జ్​ సహా పలువురు ఆటగాళ్లతో బత్రా సమావేశమయ్యారు. ఈ చర్చలో భాగంగా పలు విషయాల్ని వెల్లడించారు.

"వచ్చే ఏడాది ఎంతో క్లిష్టంగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరి దృష్టి అథ్లెట్లపైనే ఉంటుంది. ఇప్పటికే 78మంది ఒలింపిక్స్​కు అర్హత సాధించారు. మొత్తంగా 125మంది మెగాటోర్నీకి అర్హత సాధిస్తారనే నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వం, ఐఓఏ, ఎన్ఎస్​ఎఫ్​ సంయుక్తంగా కలిసి అథ్లెట్లను ఎంపిక చేసి పంపించే ప్రక్రియపై సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే హాకీ, వెయిట్​ లిఫ్టింగ్​ క్రీడల అథ్లెట్లు జులై మధ్యలో నిర్వహించబోయే పోటీలకు సంసిద్ధంగా ఉన్నారు. ఒలింపిక్స్​లో మనవాళ్లు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను"

-నరీందర్​ బత్రా, భారత ఒలింపిక్​ సంఘ అధ్యక్షుడు

భారత ఆటగాళ్లంతా 2021 ఒలింపిక్స్​లో తప్పకుండా విజయపతాకం ఎగురవేస్తారని ఒలింపిక్ విజేత, స్టార్​ షూటర్​ అభినవ్​ బింద్రా, టెన్నిస్​ స్టార్​ లియాండర్​ పేస్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

nareendar
నరీందర్​ బత్రా

ఇది చూడండి : 'సామాజిక అంశాలపై క్రీడాకారులు అందుకే స్పందించరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.