ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్​.. ఆల్​ ఇంగ్లాండ్​​ ఓపెన్​ ఫైనల్లోకి..

author img

By

Published : Mar 19, 2022, 9:59 PM IST

All England Open Laskshya Sen: ఆల్​ ఇంగ్లండ్​​ ఓపెన్​​ ఫైనల్స్​లోకి అడుగుపెట్టాడు భారత యువకెరటం లక్ష్యసేన్. ఉత్కంఠగా జరిగిన సెమీస్​లో మలేసియాకు చెందిన లీ జియాపై విజయం సాధించాడు.

all england open
lakshya sen

All England Open Laskshya Sen: ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ దూసుకెళ్తున్నాడు. సెమీఫైనల్లో మలేసియాకు చెందిన లీ జియాపై విజయం సాధించి ఫైనల్​కు చేరాడు. 21-13, 12-21, 21-19 తేడాతో గెలుపొందాడు.

రెండో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 3 ర్యాంకర్‌ను ఓడించి మరీ క్వార్టర్స్‌కు వచ్చిన లక్ష్యసేన్‌కు అదృష్టం కలిసొచ్చింది. క్వార్టర్స్‌లో చైనా ఆటగాడు లు జువాంగ్ జు తప్పుకోవడం (వాకోవర్‌) వల్ల లక్ష్యసేన్‌ సెమీస్‌కు చేరుకున్నాడు. ఇప్పటికే సింగిల్స్‌ విభాగంలో కిదాంబి రెండో రౌండ్‌లో వెనుదిరగగా.. మహిళల విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి పాలయ్యారు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్​ సూపర్​ 500 టైటిల్​ను గెలుచుకున్న లక్ష్యసేన్​ అప్పటి నుంచి మంచి ఫామ్​లో ఉన్నాడు. గత వారం జరిగిన జర్మన్​ ఓపెన్​లో అతడు రన్నరప్​గా నిలిచాడు. ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​లో కాంస్య పతకం సాధించాడు.

మెన్స్​ సింగిల్స్​లో.. ఆల్​ఇంగ్లాండ్​ ఓపెన్​ ఫైనల్​కు చేరిన నాలుగో భారత షట్లర్ లక్ష్యసేన్​ కావడం విశేషం. అంతకుముందు ప్రకాశ్​ నాథ్​, ప్రకాశ్​ పదుకొణె, పుల్లెల గోపీచంద్​ ఈ టోర్నీ ఫైనల్​కు చేరారు. పదుకొణె(1980), గోపీచంద్​(2001) విజయం సాధించగా.. నాథ్​(1947) ఓడిపోయాడు. మహిళల సింగిల్స్​లో సైనా నెహ్వాల్​ 2015లో ఫైనల్లో ఓడిపోయింది. ​

ఇదీ చదవండి: Asia Cup 2022: శ్రీలంకలో ఆసియా కప్.. ఆగస్టు నుంచి మ్యాచ్​లు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.