ETV Bharat / sports

Tokyo Olympics: హాకీలో భారత్​ రెండో విజయం

author img

By

Published : Jul 27, 2021, 8:37 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు మరో విజయం సాధించింది. స్పెయిన్​పై 3-0 తేడాతో గెలిచింది.

Tokyo Olympics
హాకీలో భారత్​ రెండో విజయం

ఒలింపిక్స్​.. హాకీలో భారత్​ జట్టు మరోసారి అదరగొట్టింది. స్పెయిన్​పై 3-0 తేడాతో గెలిచి క్వార్టర్​ ఫైనల్​ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్​ల్లో రెండింట్లో గెలిచింది టీమ్​ఇండియా. తర్వాతి మ్యాచ్​ల్లో అర్జెంటీనా, జపాన్​తో ఆడనుంది.

స్పెయిన్​తో మ్యాచ్​లో రూపిందర్​పాల్​ సింగ్​, సిమ్రన్​జీత్​ సింగ్​ మంచి ప్రదర్శన చేశారు. ఆట 13వ నిమిషంలోనే సిమ్రన్​జీత్​ కొట్టిన గోల్​తో భారత్​ ఖాతా తెరిచింది. 15వ నిమిషంలో.. పెనాల్టీ స్ట్రోక్​ను సద్వినియోగం చేసుకున్న రూపిందర్​ రెండో గోల్​ను అందించాడు. నాలుగో క్వార్టర్​లో.. మరో గోల్​ చేశాడు రూపిందర్​. దీంతో మ్యాచ్​ 3-0 తేడాతో భారత్​ వశమైంది.

తొలి మ్యాచ్​లో న్యూజిలాండ్​పై 3-2 తేడాతో గెలిచిన మన్​ప్రీత్​ సేన, ఆ తర్వాత ఆసీస్​ చేతిలో 7-1 తేడాతో చిత్తయింది.

ఇదీ చూడండి: Tokyo Olympics: ఈ ఒలింపిక్స్‌లో రష్యా కనిపించలేదేంటి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.