ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో భారత గోల్​కీపర్​ శ్రీజేష్​

author img

By

Published : Jan 5, 2022, 8:59 AM IST

భారత గోల్​ కీపర్​ శ్రీజేష్​, goal keeper sreejesh

Goalkeeper PR Sreejesh: టోక్యో ఒలింపిక్స్​లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలవడంలో కీలకంగా వ్యవహరించిన గోల్​కీపర్​ శ్రీజేష్​ ఓ ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్​ అయ్యాడు. ఒకవేళ ఇది అతడికి వరిస్తే భారత్​ తరఫున ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో హాకీ ప్లేయర్​గా నిలుస్తాడు.

Goalkeeper PR Sreejesh: టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు గోల్​కీపర్​ పీఆర్​ శ్రీజేష్​.. ఓ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని దక్కించుకునేందుకు రేసులోకి వచ్చాడు. వరల్డ్​ గేమ్స్​ అథ్లెట్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డుకు అతడు నామినేట్​ అయ్యాడు. ఆన్​లైన్​ ఓటింగ్​ ప్రక్రియ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. జనవరి 10 నుంచి 31 వరకు ఈ ప్రక్రియ జరగనుంది.

ఒకవేళ ఈ అవార్డు శ్రీజేష్​కు వరిస్తే.. భారత్​ తరఫున ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో హాకీ ప్లేయర్​గా నిలుస్తాడు. అంతకుముందు మహిళల హాకీ జట్టు కెప్టెన్​ రాణి రాంపాల్​ ఈ ఘనత దక్కించుకుంది.

శ్రీజేష్​.. ఎఫ్​ఐహెచ్​ గోల్​కీపర్​ ఆఫ్​ ది ఇయర్-2021​ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇప్పుటివరకు కెరీర్​లో మూడు సార్లు ఒలింపిక్స్​లో పాల్గొన్న అతడు.. దాదాపు 240కు పైగా అంతర్జాతీయ ప్రదర్శనలు చేశాడు. టోక్యో ఒలింపిక్స్​లో​ భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు.

ఇదీ చూడండి: PR Sreejesh: శ్రీజేష్‌.. మన 'కంచు' కోట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.