ETV Bharat / sports

Ravi Shastri: వాళ్లను మందు కొట్టడానికి పిలుస్తా: రవిశాస్త్రి

author img

By

Published : Nov 13, 2021, 5:25 PM IST

Ravi Shastri News
రవి శాస్త్రి

టీమ్​ఇండియా ప్రధాన కోచ్​గా రవిశాస్త్రి (Ravi Shastri News) శకం.. టీ20 ప్రపంచకప్​తో ముగిసింది. ప్రధాన కోచ్​గా ఉన్నన్ని రోజులు.. జట్టుకు మరపురాని విజయాలు సహా మీమర్స్​కు మంచి కంటెంట్ అందించాడు శాస్త్రి. తనపై వచ్చిన మీమ్స్​పై స్పందించిన శాస్త్రి.. మీమర్స్​ను డ్రింక్స్​ తాగేందుకు ఆహ్వానిస్తానని(Ravi Shastri Memes) అన్నాడు.

టీమ్​ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై వచ్చే మీమ్స్​కు (Ravi Shastri Memes) ఉండే క్రేజే వేరు. శాస్త్రి చేతుల్లో మందు సీసా, గ్లాసులు లేదా ఐస్ పెట్టి ఫొటోషాప్ చేసిన మీమ్స్​ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అతడు తరచూ మద్యం మత్తులో ఉంటాడనే అర్థం వచ్చే చేసే మీమ్స్​ నెటిజన్లను చాలావరకు అలరిస్తాయి. అయితే కొన్నిసార్లు టీమ్​ఇండియా వైఫల్యాలకు అతడే కారణం అని వచ్చేలా కూడా ఉంటాయి. టీ20 ప్రపంచకప్​తో (T20 World Cup 2021) ప్రధాన కోచ్​గా రవిశాస్త్రి శకం ముగిసింది. ఈ నేపథ్యంలోనే మీమ్స్​ పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శాస్త్రి (Ravi Shastri News).

"వాటిల్లో (మీమ్స్​) కొన్నింటిని ఆస్వాదిస్తాను. అది కూడా ప్రతిభే. ఒక్కసారిగా నన్ను ట్రోల్ చేస్తారు. మరుసటి రోజే అది కనుమరుగైపోతుంది. కఠిన సమయాల్లో ప్రజలకు మీమర్స్​ నవ్వులు పంచుతున్నారు. వారిలో కొందరిని డ్రింక్స్ కోసం ఆహ్వానించాలనుకుంటున్నాను"

- రవిశాస్త్రి, టీమ్​ఇండియా మాజీ కోచ్

శాస్త్రి హయాంలో టీమ్​ఇండియా ఎన్నో మధురమైన టెస్టు విజయాలను అందుకుంది. ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదనే నిరాశే తప్ప జట్టును అగ్రస్థానంలో నిలబెట్టారు. తన పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు శాస్త్రి.

మళ్లీ వ్యాఖ్యాతగా!

టీమ్​ఇండియా జట్టుకు హెడ్​ కోచ్ కావడానికి ముందు రవిశాస్త్రి వ్యాఖ్యాతగా పనిచేశాడు. 2011లో టీమ్​ఇండియా ప్రపంచకప్​ గెలిచినప్పుడు కూడా కామెంట్రీ చేశాడు శాస్త్రి. 'ధోనీ ఫినిషెస్ ఆఫ్​ ఇన్​ స్టైల్. ఇండియా లిఫ్ట్​ ద వరల్డ్​ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్(తనదైన శైలిలో ధోనీ ఆటను ముగించాడు, టీమ్​ఇండియా 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ అందుకుంది)' అని శాస్త్రి చెప్పిన మాటలు క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.

ఆ తర్వాత కోచ్​ పదవి చేపట్టడం వల్ల కామెంటరీకి దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ తన పాత బాధ్యతల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్టు(IND vs ENG 5th test)​ వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇటీవలే పేర్కొంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ మ్యాచ్​తో రవిశాస్త్రి వ్యాఖ్యాతగా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి.

అత్యుత్తమ సేవలిందించా..

టీమ్​ఇండియా ప్రధాన కోచ్​గా అత్యుత్తమ సేవలందించేందుకు ప్రయత్నించానని రవిశాస్త్రి చెప్పాడు. టీమ్​ఇండియా, విదేశాల్లో ఎన్నో విజయాలు సాధించిందని హర్షం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాను తమ సొంత గడ్డపైనే భారత్ ఓడించిందని, ఇంగ్లాండ్ సిరీస్​లోను అధిక్యంలో ఉందని పేర్కొన్నాడు.

ఇవీ చూడండి:

మీ సహకారం చరిత్రలో నిలిచిపోతుంది: కోహ్లీ

డ్రెస్సింగ్​ రూమ్​లో రవిశాస్త్రి భావోద్వేగ సందేశం

హెడ్​కోచ్​గా ఐదేళ్లు.. రవిశాస్త్రి సాధించిన ఘనతలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.