ETV Bharat / sports

'కోహ్లీ ఎప్పుడూ సూపరే'.. అతడు చేసిన పనికి ఫ్యాన్స్​ ఫిదా!

author img

By

Published : Feb 21, 2023, 4:00 PM IST

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కోహ్లీ చేసిన ఓ పని అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. విరాట్ నువ్వు సూపర్ అంటూ సోషల్​మీడియాను హోరెత్తిస్తున్నారు. ఆ వివరాలు..

Virat Kohli Urges Fans To Stop Chanting RCB
Virat Kohli Urges Fans To Stop Chanting RCB

భారత క్రికెట్‌ హిస్టరీలోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనూ టాప్​ ప్లేయర్స్​లో టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీ ఒకడు. ఇంకా చెప్పాలంటే ఈ మోడ్రన్​ క్రికెట్‌ వరల్డ్​లో అతడో అత్యుత్తమ బ్యాటర్​.. కొండంత భారీ లక్ష్యాన్నైనా అవలీలలగా చేధించే రన్​ మిషన్​​.. ఫీల్డింగ్‌లో చిరుత.. ఫిట్‌నెస్‌లో టాప్​. క్రమశిక్షణ, పట్టుదల, ఫిట్​నెస్​, దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్​ అతడిని ఈ అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టాయి. ఓ ప్లేయర్​గా ఎన్నో ప్రపంచ రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డులు సృష్టించిన అతడు.. చాలా సందర్భాల్లో ఎప్పుడూ 'ముందు దేశం తర్వాతే నేను' అని అంటుంటాడు. ఇది చాలా మంది క్రికెట్​ ప్రియులకు తెలిసిన విషయమే.

అయితే తాజాగా మరోసారి ఇదే విషయాన్ని తెలియజేశాడు విరాట్​. దిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతోజరిగిన రెండో టెస్టులో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ఆడుతున్న సమయంలో ఓ సందర్భంలో కోహ్లీ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేశాడు. అప్పుడు స్టేడియంలో ఉన్న కొంతమంది అభిమానులు 'ఆర్సీబీ, ఆర్సీబీ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టేడియంలో అరిచి అరిచి గోల చేశారు. అయితే ఆ నినాదాలను విన్న విరాట్​.. దేశం పట్ల తనకున్న ప్రేమను చూపించాడు. తాను ధిరించిన జెర్సీపై ఉన్న భారత్‌ లోగోను చూపిస్తూ 'ఇండియా ఇండియా' అంటూ అనాలని సూచించాడు. దీంతో అభిమానులు వెంటనే ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. అయినా కోహ్లీ.. మళ్లీ ఆ సౌండ్​ చాలలేదని.. ఇంకా గట్టిగా అనాలని చెప్పాడు. దీంతో ఫ్యాన్స్​ మరింత గట్టిగా ఇండియా ఇండియా అంటూ మైదానం దద్దరిల్లేలా అరిచి రచ్చ రచ్చ చేశారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఫుల్​గా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు వీడియోకు తెగ లైక్స్ కొడుతూ.. కామెంట్స్​ చేస్తున్నారు. 'విరాట్ నువ్వు గ్రేట్', 'కోహ్లీ నువ్వు సూపర్', 'నువ్వు ఎప్పుడూ నెం.1', 'విరాట్​ భయ్యా నువ్వు ఎప్పుడూ ఇలానే ఉండాలి' అంటూ కామెంట్లతో సోషల్​మీడియాను హొరెత్తించారు. ఇకపోతే ఐపీఎల్‌లో కోహ్లీ ఆర్సీబీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​లో.. తొలి రెండు మ్యాచుల్లో టీమ్​ఇండియానే విజయం సాధించింది. ప్రస్తుతం 2-0తేడాతో ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్​ మార్చి 1నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: ఆసీస్​కు భారీ షాక్​.. మిగతా రెండు మ్యాచ్​లకు వార్నర్​ దూరం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.