ETV Bharat / sports

విండీస్​​ జట్టులో మరో ఐదుగురికి కరోనా

author img

By

Published : Dec 16, 2021, 9:46 AM IST

Westindies Cricketers Corona: పాకిస్థాన్​ పర్యటనలో ఉన్న వెస్టిండీస్​ జట్టులో మరో ముగ్గురు క్రికెటర్లు సహా ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా సోకింది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్​కు పంపించారు. దీంతో కరోనా బారిన పడిన విండీస్ క్రికెటర్ల సంఖ్య ఆరుకు చేరింది.

West Indies Covid
west indies news

Westindies Cricketers Corona: వెస్టిండీస్​ క్రికెట్​ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆ జట్టులో నలుగురికి కరోనా సోకగా.. ఇప్పుడు మరో ఐదుగురు వైరస్​ బారిన పడ్డారు. పాకిస్థాన్​ పర్యటనలో ఉన్న వికెట్​కీపర్​-బ్యాటర్ షాయ్ హోప్​, స్పిన్నర్​ అకీల్ హోసేన్​, ఆల్​రౌండర్​ జస్టిన్ గ్రీవ్స్​ సహా సహాయక కోచ్ రాడీ ఎస్ట్​విక్, జట్టు ఫిజీషియన్​ డా.అక్షయ్ మాన్​సింగ్​కు వైరస్ సోకింది. పాక్​ క్రికెట్ బోర్డు నిర్వహించిన తాజా పరీక్షల్లో వీరికి పాజిటివ్​గా తేలింది.

దీంతో ఈ ముగ్గురు ప్లేయర్లు సహా సహాయక సిబ్బందిని ఐసొలేషన్​కు పంపించినట్లు వెస్టిండీస్​ క్రికెట్ బోర్డు తెలిపింది. వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించింది. అంతకుముందు ఇదే జట్టులో ఉన్న రోష్టన్​ ఛేజ్​, షెల్డన్​ కాట్రెల్​, కైల్​ మేయర్స్​తో పాటు మరో సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా బారిన పడిన విండీస్ క్రికెటర్ల సంఖ్య ఆరుకు చేరింది.

కాగా, గురువారం పాక్​తో విండీస్​ మూడో టీ20 ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో పాక్​ విజయం సాధించింది. ఆ తర్వాత ఇరు జట్లు మూడు వన్డేల్లో తలపడనున్నాయి.

ఇదీ చూడండి: Pat Cummins Covid: యాషెస్​ రెండో టెస్టుకు కమిన్స్​ దూరం.. కెప్టెన్​గా స్మిత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.