ETV Bharat / sports

వరుణుడా ఎంత పని చేశావయ్యా?.. టీమ్‌ఇండియా 'డబ్ల్యూటీసీ' పాయింట్స్​పై ఎఫెక్ట్​!

author img

By

Published : Jul 25, 2023, 10:33 AM IST

wtc points table 2023 : వెస్టిండీస్​తో జరగనున్న రెండో టెస్ట్​ మ్యాచ్ వర్షం కారణంగా​ డ్రాగా ముగిసింది. ఈ ఎఫెక్ట్​.. టీమ్​ఇండియా డబ్ల్యూటీసీ పాయింట్స్​పై పడింది.

wtc points table 2023 :
వరుణుడా ఎంత పని చేశావయ్యా?.. టీమ్‌ఇండియా 'డబ్ల్యూటీసీ' పాయింట్స్​పై ఎఫెక్ట్​!

wtc points table 2023 : డబ్ల్యూటీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(2023 - 2025) మూడో సీజన్‌ను టీమ్​ఇండియా ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టీమ్‌ఇండియాకు.. వరుణుడి రూపంలో ఓ అడ్డంకి ఎదురైంది. దీంతో క్రికెట్​ అభిమానులు వరుణుడా ఎంత పనిచేశావయ్యా అంటూ కామెంట్లు అంటున్నారు.

ఇదీ జరిగింది.. వెస్టిండీస్​-టీమ్​ఇండియా మధ్య రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్​ జరిగింది. ఇందులో భారత్​ 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. అయితే మొదటి మ్యాచ్​లో విజయం సాధించిన టీమ్​ఇండియాకు.. రెండో మ్యాచ్​లో విజయం సాధించే అవకాశం చేజారింది. ఐదో రోజు ఆటకు సిద్ధమైన వేళ.. వర్షం రావడం వల్ల మనోళ్లకు క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం పోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ ముందుకెళ్లలేకపోయింది. రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Teamindia wtc points table : ప్రస్తుతం టీమ్​ఇండియా.. రెండు టెస్టుల్లో ఒక విజయం, ఒక డ్రాతో 16 పాయింట్లు సాధించింది. కానీ పర్సంటేజీలో మాత్రం 66.67 శాతంతోనే కొనసాగుతోంది. ఇక ఈ లిస్ట్​లో పాకిస్థాన్‌ అగ్రస్థానంలో ఉంది. శ్రీలంకతో మొదటి టెస్టులో ఘన విజయాన్ని సాధించిన పాకిస్థాన్​ జట్టు.. 12 పాయింట్లు సాధించి 100 పర్సంటేజీతో అందరికన్నా ముందుంది. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది.

ఇక యాషెస్ సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు టెస్టుల్లో ఆడిన ఆస్ట్రేలియా 54.17 శాతం, ఇంగ్లాండ్‌ 29.17 శాతంతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ సిరీస్​ ఆసీస్‌ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక చివరి టెస్ట్​ మ్యాచ్​ జులై 27న లండన్‌ వేదికగా జరగాల్సి ఉంది.

వెస్టిండీస్‌.. ప్రస్తుతం టీమ్​ఇండియాపై ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం వల్ల.. 4 పాయింట్లు సాధించి 16.67 శాతంతో ఉంది. ఇక ఈ ఏడాది ఆసియా కప్‌, ప్రపంచకప్‌ టోర్నీలు జరిగే వరకు టీమ్​ఇండియా.. టెస్టు సిరీస్‌లు ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. భారత్​ డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతోనే టెస్టు సిరీస్‌ ఆడనుంది.

ఇదీ చూడండి :

IND VS WI 2023 : వరుణుడిదే విజయం.. సిరీస్​ టీమ్​ఇండియా సొంతం

టెస్టుల్లో 'డబుల్‌' డిజిట్స్‌.. ఫస్ట్​ బ్యాటర్‌గా రోహిత్ రికార్డ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.