ETV Bharat / sports

ఇంగ్లాండ్​కు టీమ్​ఇండియా.. ఆఖరి టెస్టులో కొత్త కెప్టెన్లతో బరిలోకి

author img

By

Published : Jun 16, 2022, 1:30 PM IST

Updated : Jun 16, 2022, 2:18 PM IST

d
d

ఇంగ్లాండ్​తో గతేడాది జరిగిన టెస్టు సిరీస్​లో మిగిలి ఉన్న ఆఖరి మ్యాచ్​ను ఆడేందుకు టీమ్​ఇండియా రెడీ అయింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఆ మ్యాచ్​ జూలై 1న జరగనుంది. గతేడాది సిరీస్​ జరిగిన సమయంలోను ఇప్పటికీ పోలిస్తే ఇరు జట్లలో చాలా మార్పులు జరిగాయి.

గతేడాది ఇంగ్లాండ్​ పర్యటనలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆఖరి టెస్టు మ్యాచ్​ను ఆడేందుకు టీమ్​ఇండియా సిద్ధమైంది. ఇందుకోసం టీమ్​ఇండియా జట్టు గురువారం ఇంగ్లాండ్​ బయలుదేరింది. ఇందుకు సంబంధించి ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్​లో షేర్​ చేసింది. ఈ ఫొటోల్లో విరాట్​ కోహ్లీ, జడేజా, పుజారా, శార్దూల్​ ఠాకూర్​, ప్రసిద్ధ్​ కృష్ణ, శుభ్​మన్​ గిల్​ మొదలైన ఆటగాళ్లు ఉన్నారు. ఈ మ్యాచ్​ ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా జూలై 1 నుంచి జరగనుంది. ఇప్పటికే భారత్​​ 2-1తో ఆధిక్యంలో ఉంది.

కొత్త కెప్టెన్లు​..: ఇంగ్లాండ్​తో గతేడాది జరిగిన టెస్టు సమయానికి ఇప్పటికీ టీమ్​ఇండియా జట్టులో చాలా మార్పులు జరిగాయి. ప్రధానంగా అప్పుడు జట్టుకు విరాట్​ కోహ్లీ కెప్టెన్సీ చేపట్టగా.. ఇప్పుడు రోహిత్​ శర్మ సారథ్యం వహించనున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్​ జట్టులో కూడా ఇదే పరిస్థితి.. అప్పడు జో రూట్​ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా.. ఈ మ్యాచ్​కు ఇటీవల టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న బెన్​ స్టోక్స్​ నాయకత్వం వహించనున్నాడు.

కోచ్​ల విషయంలో కూడా రెండు జట్ల పరిస్థితి ఒకటే. గతేడాది సిరీస్​ సమయంలో ఉన్న కోచ్​లు ఇప్పుడు లేరు. వారి స్థానంలో కొత్త కోచ్​లు బాధ్యతలు చేపట్టారు. టీమ్​ఇండియాకు కోచ్​గా గతేడాది సిరీస్​లో రవిశాస్త్రి ఉంటే.. ఇప్పుడు రాహుల్​ ద్రవిడ్​ ఆ బాధ్యతలను చేపడుతున్నాడు. ఇంగ్లాండ్​కు అప్పట్లే క్రిస్​ సిల్వర్​వుడ్​ కోచ్​గా ఉంటే ఇప్పుడు ఆ స్థానంలో బ్రెండన్​ మెక్​కల్లమ్​ వచ్చాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్​తో బిజీగా ఉన్న రిషభ్​పంత్​, శ్రేయస్​ అయ్యర్​లు ఈ మ్యాచ్​లు ముగిశాక ఇంగ్లాండ్​ టెస్టు కోసం జట్టులో చేరతారు.

ఇదీ చూడండి : టీమ్ఇండియా కెప్టెన్​గా హార్దిక్ పాండ్య.. టీంలోకి త్రిపాఠి ఎంట్రీ

Last Updated :Jun 16, 2022, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.