T20 worldcup 2021: తేలిపోయిన భారత్​.. పాకిస్థాన్​ ఘన విజయం

author img

By

Published : Oct 24, 2021, 11:00 PM IST

Updated : Oct 24, 2021, 11:40 PM IST

pakisthan

టీ20 ప్రపంచకప్​లో (T20 worldcup 2021) భాగంగా టీమ్​ఇండియాతో జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్​ (IND Vs PAK) ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రపంచకప్​ చరిత్రలో భారత్​పై పాక్​కు ఇది తొలి విజయం కాగా.. పాక్​పై భారత్​కు ఇది తొలి ఓటమి.

టీమ్​ఇండియా అభిమానులకు నిరాశ ఎదురైంది. టీ20 ప్రపంచకప్​లో (T20 worldcup 2021) భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో భారత జట్టు పది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ప్రపంచకప్​ చరిత్రలో పాకిస్థాన్​పై భారత్ (IND Vs PAK) ఓడిపోవడం​ ఇదే తొలి సారి. టీమ్​ఇండియా నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని కెప్టెన్​ బాబర్​ అజామ్(68)​, మహ్మద్​ రిజ్వాన్​(79) వికెట్​ కోల్పోకుండా ఛేదించారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించినా..

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియాకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే కేఎల్ రాహుల్ (3)కూడా పెవిలియన్‌కు చేరాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ (57) అర్ధశతకం.. రిషభ్‌ పంత్ (39) రాణించడం వల్ల టీమ్​ఇండియా ఓ మోస్తరు స్కోరును చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ 11, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య 11 పరుగులు చేశారు. పాకిస్థాన్‌ బౌలర్లలో షాహీన్ 3, హసన్‌ అలీ 2, షాదాబ్‌ ఖాన్‌ ఒక వికెట్ తీశారు.

కోహ్లీ రికార్డు

కాగా.. ఈ మ్యాచ్​లో హాఫ్​ సెంచరీ చేసిన టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ(57).. ప్రపంచకప్​ చరిత్రలో పది అర్ధ శతకాలు బాదిన తొలి ప్లేయర్​గా నిలిచాడు.

ఇదీ చూడండి: T20 worldcup: తడబడిన టీమ్​ఇండియా.. పాకిస్థాన్​ లక్ష్యం 152

Last Updated :Oct 24, 2021, 11:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.