టెస్ట్​ ఛాంపియన్​షిప్​ పట్టికలో భారత్​ స్థానం ఇదే

author img

By

Published : Nov 25, 2021, 3:57 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్లపట్టిక, World Test Championship Points Table

world test championship points table 2021: ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​కు సంబంధించిన ​తాజా పాయింట్ల పట్టికను విడుదల చేసింది ఐసీసీ. ఇందులో శ్రీలంక అగ్రస్థానంలో నిలవగా.. టీమ్​ఇండియా రెండో ర్యాంకులో ఉంది.

world test championship points table 2021: తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాపర్​గా నిలిచింది శ్రీలంక. టీమ్ఇండియా​ రెండో ర్యాంకులో ఉంది. భారత్​కు ఎక్కువ పాయింట్లు ఉన్నప్పటికీ విజయాల శాతం ఆధారంగా ప్రస్తుతానికి శ్రీలంకకే అగ్రస్థానం దక్కింది. తాజాగా వెస్టిండీస్​తో జరిగిన తొలి టెస్ట్​ మ్యాచ్​లో 187పరుగుల తేడాతో విజయం సాధించింది లంక జట్టు. ఈ ఫలితంతోనే పాయింట్ల పట్టికలో ముందంజలో నిలిచింది.

ప్రస్తుతం శ్రీలంక(12 పాయింట్ల, గెలుపు శాతం 100), టీమ్​ఇండియా(26, 54.17%), పాకిస్థాన్​(12, 50%), వెస్టిండీస్​(12, 33.33%), ఇంగ్లాండ్​(14, 29.17%) తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

శ్రీలంక-విండీస్​ మ్యాచ్​ సాగిందిలా..

348 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్​ ఆడిన వెస్టిండీస్​ 160 పరుగులకే కుప్పకూలింది(sri lanka west indies live score match). విండీస్​ ప్లేయర్స్​లో కుమ్రా బానర్​(68), జాష్వా డిసిల్వా (54) తప్ప మిగతా వారు విఫలమయ్యారు. లంక బౌలర్లలో రమేశ్​ మెండిస్​ 5, లసిత్​ ఎంబుల్డేనియా 4, ప్రవీన్​ జయవిక్రమ ఓ వికెట్​ను దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్​లో 147, రెండో ఇన్నింగ్స్​లో 83 పరుగులతో అదరగొట్టిన లంక కెప్టెన్​ కరణరత్నేకు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది. కాగా, టీమ్​ఇండియా ప్రస్తుతం కాన్పూర్​ వేదికగా న్యూజిలాండ్​తో తొలి టెస్టు ఆడుతోంది.

ఇదీ చూడండి: ధోనీ అభిమానులకు గుడ్​న్యూస్.. మరో మూడేళ్లు సీఎస్కేతోనే!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.