ETV Bharat / sports

శ్రీలంకతో టెస్టు సిరీస్​.. ఎవరీ సౌరభ్​కుమార్​?

author img

By

Published : Feb 20, 2022, 11:43 AM IST

Saurabh Kumar Cricketer: ఇటీవల బీసీసీఐ యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడంపై ప్రాధాన్యం పెంచింది. తాజాగా శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్​తో మరో కొత్త ఆటగాడు టీమ్​ఇండియాలోకి అడుగుపెట్టనున్నాడు. అతనే సౌరభ్​ కుమార్​. ఈ స్పిన్​ ఆల్​రౌండర్​ అయిన సౌరభ్​ కుమార్​ జట్టులో ఎలాంటి పాత్ర పోషిస్తాడో అని క్రికెట్​ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Saurabh Kumar Cricketer
సౌరభ్​ కుమార్

Saurabh Kumar Cricketer: రోహిత్​ శర్మ సారథ్యంలో టీమ్​ఇండియా వచ్చే నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్​లో తలపడనుంది. టెస్టు స్పెషలిస్టులు రహానే, పుజారాలు గత కొంతకాలంగా ఫామ్​తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారిపై వేటు వేసింది బీసీసీఐ. ఆ స్థానంలో యువక్రికెటర్లకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో జట్టులోకి సౌరభ్​ కుమార్​ అనే మరో కొత్త క్రికెటర్​కు చోటు కల్పించింది.

అసలు ఎవరు ఈ సౌరభ్​ కుమార్​?

1993 మే 1న ఉత్తర్​ప్రదేశ్​లోని భాగ్​పత్​లో జన్మించిన సౌరభ్​కుమార్​.. స్పిన్​ ఆల్​రౌండర్​. అండర్​-19, అండర్​-22 విభాగాల్లో యూపీ తరపున ఆడాడు. 2014లో హిమాచల్​ ప్రదేశ్​తో జరిగిన మ్యాచ్​లో సర్వీసెస్​ తరపున ఆడి రంజీల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్​ 45 పరుగులు చేసిన సౌరభ్​ ఒక వికెట్​ పడగొట్టాడు. ఆ తర్వాత ఉత్తర్​ప్రదేశ్​ జట్టులో చేరాడు. 46 ఫస్ట్​ క్లాస్​ మ్యాచుల్లో 2.70 సగటున 196 వికెట్లు పడగొట్టాడు ఈ స్పిన్నర్​. అత్యధికంగా ఓ ఇన్నింగ్స్​లో ఏడు వికెట్లు తీసిన రికార్డు సౌరభ్​ సొంతం. బ్యాటింగ్​లోనూ సౌరభ్​ మెరుగైన ప్రదర్శనే చేశాడు.. 63 ఫస్ట్​ క్లాస్​ మ్యాచుల్లో 1572 పరుగులు చేశాడు. వీటిలో ఎనిమిది అర్ధశతకాలు, రెండు శతకాలు ఉన్నాయి.

ఐపీఎల్​లో కూడా..

లిస్ట్​-ఏ ఫార్మాట్​లో సౌరభ్​ ఎకానమీ రేటు 4.38. టీ20ల్లో ఇది 7.03గా ఉంది. అందుకే 2017 ఐపీఎల్​లో చోటు దక్కించుకున్నాడు. వేలంలో రైజింగ్​ పూణె సూపర్​ జయంట్స్​ జట్టు రూ.10 లక్షలు వెచ్చించి సౌరభ్​ను సొంతం చేసుకుంది. కానీ ఆ సీజన్​లో సౌరభ్​కు అసలు ఆడే అవకాశం రాలేదు. మళ్లీ 2021లో జరిగిన వేలంలో సౌరభ్​ను రూ.20 లక్షలకు పంజాబ్​ కింగ్స్​ దక్కించుకుంది. కానీ ఈసారి కూడా అదే సీన్​ రిపీట్​ అయింది. సౌరభ్​కు తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం దక్కలేదు.

2015 డిసెంబరు 10న ఉత్తర్​ప్రదేశ్​ తరపున హిమాచల్​ ప్రదేశ్​తో జరిగిన మ్యాచ్​తో లిస్ట్​-ఏ ఫార్మాట్​లోకి అడుగుపెట్టాడు సౌరభ్. 10 ఓవర్లలో ప్రత్యర్థికి 36 పరుగులు మాత్రమే ఇచ్చిన సౌరభ్​ రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు లిస్ట్​-ఏ ఫార్మాట్​లో 24 ఇన్నింగ్స్​లు ఆడిన సౌరభ్​ 37 వికెట్లు తీశాడు. 16 ఇన్నింగ్స్​లో 173 పరుగులు చేశాడు.

ఎప్పటి నుంచో టీమ్​ఇండియాలో ఛాన్స్​ కోసం నిరీక్షిస్తున్న సౌరభ్​కు శ్రీలంక సిరీస్​తో కలనెరవేరినట్లు అయింది. ఈ కొత్త క్రికెటర్​కు అవకాశం కల్పిస్తే మెరుగైన ప్రదర్శన చేసి జట్టు విజయానికి తోడ్పడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి : రోహిత్​ పూర్తిస్థాయి​ కెప్టెన్సీ- వరమా.. భారమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.