ETV Bharat / sports

దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​కు రోహిత్ దూరం.. కెప్టెన్​గా కేఎల్ రాహుల్

author img

By

Published : Dec 31, 2021, 8:43 PM IST

Updated : Dec 31, 2021, 8:59 PM IST

kl rahul
కేఎల్ రాహుల్

20:42 December 31

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు జట్టు ప్రకటన

హిట్​మ్యాన్ రోహిత్ శర్మ అభిమానులకు నిరాశ. తొడ కండరాల పట్టేయడం వల్ల దక్షిణాఫ్రికాతో టెస్టులకు దూరమైన అతడు.. ఇప్పుడు వన్డే సిరీస్​లోనూ ఆడటం లేదు. దీంతో కెప్టెన్​గా రోహిత్ శర్మ బాధ్యతలు అందుకునేందుకు మరింత సమయం పట్టేలా ఉంది.

రోహిత్​ దూరమవడం వల్ల ఈ వన్డే సిరీస్​కు కేఎల్ రాహుల్​ను కెప్టెన్​గా నియమిస్తూ, 18 మందితో కూడిన జట్టును ప్రకటించారు. పేసర్ బుమ్రాను వైస్​ కెప్టెన్​గా నియమించారు. జనవరి 19,21,23 తేదీల్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.

టీమ్​ఇండియా జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్​ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకుర్, సిరాజ్

Last Updated :Dec 31, 2021, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.