ETV Bharat / sports

శ్రీలంకతో టీ20 సిరీస్​కు భారత స్టార్​పేసర్​ దూరం!

author img

By

Published : Feb 21, 2022, 4:08 PM IST

India Sri Lanka T20 series: స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్​కు టీమ్​ఇండియా స్టార్​పేసర్​ దీపక్ చాహర్​ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ​వెస్డిండీస్​తో చివరి టీ20 సందర్భంగా చాహర్​ మోకాలికి గాయమైంది.

india Sri Lanka T20 series
india Sri Lanka T20 series

శ్రీలంకతో జరగనున్న టీ20 సరీస్​కు ముందు టీమ్​ఇండియాకు భారీ షాక్​ తగిలేలా కనిపిస్తోంది. పాస్ట్​బౌలర్​ దీపక్​ చాహర్​ గాయం కారణంగా ఆ సిరీస్​కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వెస్డిండీస్​తో ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో చాహర్​ మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో 1.5 ఓవర్లు బౌలింగ్​ చేసి, మైదానం నుంచి బయటకొచ్చేశాడు. ఈ మ్యాచ్​లో కీలక వికెట్లు పడగొట్టి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాలు పట్టేలా ఉంది.

చెన్నైకి ఎదురుదెబ్బ!

ఒకవేళ ఇదే జరిగితే చాహర్​ ఐపీఎల్​లో కూడా ప్రారంభ మ్యాచ్​లకు దూరం కావాల్సి వస్తుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్​ మెగా వేలంలో చాహర్​ను చెన్నై సూపర్ కింగ్స్​ రూ.14 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి, తిరిగి సొంతం చేసుకుంది. చాహర్​ గాయం.. చెన్నై జట్టు ప్రణాళికలపై స్వల్ప ప్రభావం చూపొచ్చు.

లఖ్​నవూ వేదికగా ఫిబ్రవరి 24న భారత్​-శ్రీలంక మధ్య తొలి టీ20 జరగనుంది. భారత పర్యటనలో భాగంగా శ్రీలంక మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.

ఇదీ చూడండి: రోహిత్‌.. తొలి కెప్టెన్​గా సరికొత్త రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.