ETV Bharat / sports

ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఆయనే నాకు స్ఫూర్తి: రోహిత్​

author img

By

Published : Apr 6, 2022, 9:21 AM IST

My inspiration has always been Sachin Tendulkar
My inspiration has always been Sachin Tendulkar

Rohit Sharma Inspiration: రోహిత్​ శర్మ.. టీమ్​ఇండియాకు ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్​లో సారథిగా ముంబయి ఇండియన్స్​ను ఐదుసార్లు ఛాంపియన్స్​గా నిలిపాడు. మరి.. తనలో క్రికెట్​ స్ఫూర్తిని నింపిందెవరు? రోహిత్​కు ఎవరి ఆట అంటే ఇష్టం? అతడి మాటల్లోనే..

Rohit Sharma Inspiration: ప్రస్తుతం టీమ్​ఇండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్​గా వ్యవహరిస్తూ.. జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు రోహిత్​ శర్మ. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లోనూ ముంబయి ఇండియన్స్​ జట్టును ముందుండి నడిపించి.. ఇప్పటికే ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ఐపీఎల్​లో ముంబయి జట్టుకు భారత క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందుల్కర్​ మెంటార్​గా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన్​ గురించి మాట్లాడాడు హిట్​ మ్యాన్​. సచిన్​ ఆటను చూస్తూ పెరిగానని.. క్రికెట్​ ఆడటంలో ఆయనే స్ఫూర్తి అని వెల్లడించాడు. మైదానం లోపలా, బయటా సచిన్​ను అనుసరిస్తానని చెప్పాడు.

''సచిన్​ తెందుల్కరే ఎప్పటికీ నాకు స్ఫూర్తి. నాకు తెలిసినప్పటినుంచి సచిన్​ ఆటను చూస్తున్నాను. దగ్గరుండి కూడా సచిన్​ గేమ్​ను చూశా. ఆయన ఎన్నో ఘనతలు సాధించాడు. క్రికెట్​ ఆడటం విషయానికి వస్తే.. ఆ రికార్డుల్ని ఎవరైనా అందుకోగలరని నేను అనుకోవట్లేదు. దాదాపు 25 ఏళ్లు.. జట్టు బాధ్యతను తన భుజస్కందాలపై మోశాడు. అది అంత సులభమేం కాదు. క్రికెటర్​గా ఎన్నో సాధించినా.. ఎంతో వినయంగా ఉంటాడు.''

- రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా కెప్టెన్​

2022 ఐపీఎల్​ విషయానికి వస్తే.. ముంబయిలో ఆడుతుండటం తమకు పెద్దగా ప్రయోజనమేమీ చేకూర్చదని ఉద్ఘాటించాడు రోహిత్​. జట్టులో చాలా మంది కొత్తవారేనని, అయినా ముంబయిలో ఆడక చాలా రోజులైందని చెప్పాడు. ''నేను, సూర్య కుమార్​ యాదవ్​ మాత్రమే ముంబయికి చెందినవాళ్లం. మిగతావారంతా కొత్తోళ్లే. వారికి ఇక్కడ ఆడిన అనుభవం లేదు. ఒకవేళ గతేడాది ఐపీఎల్​ ముంబయిలో ఉంటే అది ప్రయోజనం అని చెప్పేవాడిని. ఎందుకంటే అప్పుడు చాలా మందికి ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. కానీ ఇప్పుడు కాదు.'' అని రోహిత్​ వివరించాడు.

ప్రస్తుత ఐపీఎల్​కు ముందు మెగా వేలం జరిగింది. చాన్నాళ్లుగా ముంబయికి ఆడిన హార్దిక్​ పాండ్య, కృనాల్​ పాండ్య, ట్రెంట్​ బౌల్ట్​, రాహుల్​ చాహర్​, డికాక్​ సహా పలువురు ఇతర జట్లకు వెళ్లారు. ముంబయి ఇండియన్స్​లో రోహిత్​, సూర్యకుమార్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​, బుమ్రా, పొలార్డ్​ మినహా అంతా కొత్తవారినే తీసుకుంది యాజమాన్యం. అయితే.. ఈ ఐపీఎల్​లో ముంబయి ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. తొలుత దిల్లీ క్యాపిటల్స్​, తర్వాత రాజస్థాన్​ రాయల్స్​తో ఓడిపోయింది. బుధవారం.. కోల్​కతా నైట్​రైడర్స్​తో తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు పుణె ఎంసీఏ స్టేడియంలో మ్యాచ్​ జరగనుంది.

ఇవీ చూడండి: 'మాకేం ప్రయోజనం? అక్కడ ఆడి రెండేళ్లు అవుతుంది'

'ఆ ఒక్కటి జరగకపోయుంటే.. రోహిత్​కు ఎప్పుడో కెప్టెన్సీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.