ETV Bharat / sports

ముష్ఫికర్​కు షోకాజ్​ నోటీసులిచ్చిన బంగ్లా బోర్డు

author img

By

Published : Nov 20, 2021, 11:52 AM IST

బంగ్లాదేశ్​ క్రికెట్ బోర్డు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు ఆ దేశ జట్టు క్రికెటర్ ముష్ఫికర్​ రహీమ్(mushfiqur rahim news)​. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సెలక్షన్ ప్యానెల్ అతడికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

mushfiqur rahim
ముష్ఫికర్ రహీమ్

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్​ రహీమ్(mushfiqur rahim latest news) వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(bangladesh cricket board). సెలక్షన్​ ప్యానెల్​కు వ్యతిరేకంగా మాట్లాడిన రహీమ్​కు షోకాజ్ నోటీసులు అందించింది.

2021-23 ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ నేపథ్యంలో పాకిస్థాన్, న్యూజిలాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​లో బంగ్లాదేశ్​ తరఫున ఆడేందుకు ముష్ఫికర్​కు అవకాశం లభించలేదు. ఈ క్రమంలోనే పాకిస్థాన్​తో​ టీ20 సిరీస్​ నుంచి కూడా ముష్ఫికర్​ను దూరం పెట్టింది బంగ్లా బోర్డు. అతడికి విశ్రాంతి ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రహీమ్(mushfiqur rahim news)​ బంగ్లా సెలక్షన్​ ప్యానెల్​పై పలు వ్యాఖ్యలు చేశాడు.

"టీమ్ నుంచి నన్ను తప్పిస్తున్నట్లు వారు నిజం చెప్పి ఉండాల్సింది. ఆటగాడి ప్రదర్శన​లో హెచ్చుతగ్గులు సహజమే. ఫిట్​నెస్​ విషయంలోనూ విమర్శలొస్తుంటాయి. మరో ఆటగాడి కోసం చూస్తున్నామని బోర్డు స్పష్టంగా చెప్పి ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని." అని ముష్ఫికర్ రహీమ్ అన్నాడు.

టీ20 ప్రపంచకప్​లో రహీమ్​ పేలవ ప్రదర్శన చేశాడు. స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్​లోనూ అతడు విఫలమయ్యాడు. దీంతో పాకిస్థాన్​తో సిరీస్​కు అతడికి అవకాశమివ్వలేదు బంగ్లాదేశ్ సెలక్షన్ ప్యానెల్.

ఇదీ చదవండి:

'పరిస్థితులు అనుకూలించకపోయినా.. అద్భుతంగా ఆడాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.