Dhoni csk: నా దృష్టిలో కోల్​కతా జట్టే విజేత: ధోనీ

author img

By

Published : Oct 16, 2021, 7:24 AM IST

Updated : Oct 16, 2021, 8:53 AM IST

Dhoni CSK

తన ఐపీఎల్​ ఆడేది లేనిదానిపై మరోసారి ధోనీ స్పష్టత ఇచ్చాడు. రాబోయే 10 సీజన్ల కోసం చెన్నై జట్టుకు ఆటగాళ్లను తయారు చేసే పనిలో ప్రస్తుతం ఉన్నామని అన్నాడు. ఐపీఎల్​-2021 సీజన్​లో తన జట్టును విజేతగా నిలిపిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు.

స్టార్ క్రికెటర్​ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో ట్రోఫీ. ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శన చేసిన చెన్నై సూపర్​కింగ్స్.. నాలుగోసారి సగర్వంగా ఐపీఎల్​ కప్​ను ముద్దాడింది. గతేడాది ఇదే చోట టోర్నీలో ఘోరంగా విఫలమైన ఈ జట్టు.. సరిగ్గా ఏడాదిలో కప్పు కొట్టి విమర్శకుల నోళ్లు మూయించింది. ఈ సందర్భంగా మ్యాచ్​ అనంతరం చెన్నై జట్టు గురించి, తన ఐపీఎల్​ రిటైర్మెంట్​ గురించి ధోనీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"ఇంతకు ముందే చెప్పా. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. ఐపీఎల్​లో నేను ఆడేది లేనిది బీసీసీఐ రిటెన్షన్​ పాలసీపై ఆధారపడి ఉంటుంది. కొత్తగా రెండు జట్లు వస్తున్నాయి. ఈ సమయంలో నా రిటైర్మెంట్​ గురించి కాదు చెన్నై జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాను. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలవడం ముఖ్యం కాదు. ఏ సీజన్​లోనూ ఇబ్బంది పడకుండా ఉండే ఆటగాళ్లు బృందాన్ని తయారు చేయడం ముఖ్యం. రాబోయే 10 ఏళ్ల కోసం చెన్నై జట్టులో ఉండే ఆటగాళ్ల కోసం మేం ప్రస్తుతం చూస్తున్నాం" అని ధోనీ అన్నాడు.

.
.

"ఈ సీజన్​లోని ప్రతి మ్యాచ్​లోనూ మా జట్టు నుంచి ఒక్కో ఆటగాడు మ్యాచ్​ విన్నర్​గా నిలవడం ఆనందంగా ఉంది. ప్రతి ఫైనల్​ ప్రత్యేకం. మీరు గణాంకాలు గమనిస్తే ఎక్కువసార్లు ఫైనల్​లో ఓడింది మేమే అని తెలుస్తుంది. అందుకే ఎలాగైనా సరే దానిని అధగమించి, గట్టి కమ్​బ్యాక్ ఇవ్వాలని చూశాం" అని ధోనీ చెప్పాడు.

అలానే చెన్నైసూపర్​కింగ్స్​ జట్టుకు ఎంతో అండగా నిలిచిన అభిమానులకు ధోనీ ధన్యవాదాలు చెప్పాడు. తమతో ఫైనల్​లో తలపడిన కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టుపైనా ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్​లో వేరే జట్టు ఏదైనా ట్రోఫీ గెలిచే అర్హత ఉందంటే అది కోల్​కతాకు మాత్రమే అని అన్నాడు.

.
.

ఈ సీజన్​లో తమ ప్రదర్శన పట్ల చాలా ఆనందంగా ఉందని కోల్​కతా కెప్టెన్ మోర్గాన్ అన్నాడు. తమ జట్టులోని ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని మెచ్చుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్, శుభ్​మన్ గిల్​ అదరగొట్టారని ప్రశంసించాడు.

శుక్రవారం జరిగిన ఫైనల్​లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. డుప్లెసిస్(86), రుతురాజ్(32), ఉతప్ప(31), మొయిన్(37) పరుగులతో ఆకట్టుకున్నారు. ఛేదనలో కోల్​కతా బాగానే ఆడినప్పటికీ వెంకటేశ్ అయ్యర్(50), శుభ్​మన్ గిల్(51) మినహా మిగిలిన బ్యాట్స్​మెన్ తేలిపోయారు. దీంతో కప్పు చెన్నై వశమైంది.

.
.

ఇవీ చదవండి:

Last Updated :Oct 16, 2021, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.