ETV Bharat / sports

IPL 2021 News: టాస్ గెలిచిన ఆర్సీబీ.. రాజస్థాన్ బ్యాటింగ్

author img

By

Published : Sep 29, 2021, 7:02 PM IST

Updated : Sep 29, 2021, 7:08 PM IST

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది రాజస్థాన్ రాయల్స్ (RR vs RCB 2021). ఈ మ్యాచ్​లో ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది.

rcb
ఆర్సీబీ

ఐపీఎల్ 2021లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవడమే లక్ష్యంగా నేడు (సెప్టెంబర్ 29) రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్​లో ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.

ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. టాప్-4 రేసులో ఆర్సీబీ కాస్త ముందుండగా.. రాజస్థాన్ ఆడే ప్రతి మ్యాచ్​లోనూ గెలవాల్సిన పరిస్థితి.

ఫేస్ టూ ఫేస్

ఇప్పటివరకు ఈ రెండు జట్లు 23 మ్యాచ్​ల్లో తలపడగా ఆర్సీబీ 11, రాజస్థాన్ 10 మ్యాచ్​ల్లో గెలిచాయి.

జట్లు

రాజస్థాన్ రాయల్స్

ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), లివింగ్​స్టోన్, మహిపాల్ లోమ్రోర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, మోరిస్, కార్తీక్ త్యాగి, సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

కోహ్లీ (కెప్టెన్), పడిక్కల్, కేఎస్ భరత్, మ్యాక్స్​వెల్, డివిలియర్స్, డేనియర్ క్రిస్టియన్, జార్జ్ గార్డన్, షాబాద్ అహ్మద్, హర్షల్ పటేల్, సిరాజ్, చాహల్

Last Updated : Sep 29, 2021, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.