ETV Bharat / sports

IPL 2021 news: తడబడిన పంజాబ్.. ముంబయి లక్ష్యం 136

author img

By

Published : Sep 28, 2021, 9:15 PM IST

ఐపీఎల్ 2021(IPl 2021 News)లో భాగంగా ముంబయి ఇండియన్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 135 పరుగులు చేసింది. మర్క్​రమ్ (42), హుడా (28) ఆకట్టుకున్నారు.

IPL 2021
ఐపీఎల్

ఐపీఎల్ 2021(IPl 2021 News)లో భాగంగా ముంబయి ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులు చేసింది. మర్క్​రమ్ (42), హుడా (28) ఆకట్టుకున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​కు మొదట శుభారంభాన్నిచ్చారు ఓపెనర్లు రాహుల్, మన్​దీప్ సింగ్. వీరిద్దరూ తొలి వికెట్​కు 36 పరగులు జోడించారు. అనంతరం రాహుల్​ (21)ను పొలార్డ్​ పెవిలియన్ పంపగా, మన్​దీప్ సింగ్​ (15)ను ఔట్ చేశాడు కృనాల్ పాండ్యా. తర్వాత వచ్చిన గేల్​ (1), పూరన్ (2) దారుణంగా విఫలమయ్యారు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నారు మర్క్​రమ్, దీపక్ హుడా. ముంబయి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఐదో వికెట్​కు 50 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. వీరి ఇన్నింగ్స్ సాఫీగా సాగుతోన్న క్రమంలో మర్క్​రమ్ (42)ను క్లీన్ బౌల్డ్ చేశాడు రాహుల్ చాహర్. అనంతరం హుడా 28 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత ముంబయి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల నిర్ణీత ఓవర్లలో 135 పరుగులకు పరిమితమైంది పంజాబ్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.