ETV Bharat / sports

IPL 2021: యూఏఈకి బయల్దేరిన సీఎస్కే ఆటగాళ్లు

author img

By

Published : Aug 13, 2021, 1:36 PM IST

ఐపీఎల్​-2021 సెకండ్​ లెగ్​లో పాల్గొనేందుకు చెన్నై సూపర్​కింగ్స్​ ఆటగాళ్లు యూఏఈ పయనమయ్యారు. శుక్రవారం ఉదయం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్​కు బయల్దేరారు.

IPL 2021: MS Dhoni-led Chennai Super Kings depart for UAE
IPL 2021: దుబాయ్​కి బయల్దేరిన సీఎస్కే కెప్టెన్​ ధోనీ

ఐపీఎల్​-2021 సెకండ్​ లెగ్​లో పాల్గొనేందుకు దుబాయ్​ పయయనమయ్యాడు చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ. శుక్రవారం ఉదయం ధోనీతో సహా జట్టు ఆటగాళ్లంతా చెన్నై విమానాశ్రయం నుంచి యూఏఈకి బయల్దేరారు. ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం సోషల్​మీడియాలో వెల్లడించింది.

గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన ఎంఎస్​ ధోనీ.. ఐపీఎల్​లో కొనసాగుతున్నాడు. ఈ మెగా లీగ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్​-2021లో మిగిలిన మ్యాచ్​లు సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు జరగనున్నాయి.

అయితే శుక్రవారం ఉదయం డిఫెండింగ్​ ఛాంపియన్స్​ ముంబయి ఇండియన్స్​ ఆటగాళ్లూ యూఏఈ బయల్దేరారు. ఐపీఎల్​ సెకండ్​ లెగ్​లోని తొలి మ్యాచ్​లో చెన్నై, ముంబయి జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది.

ఇదీ చూడండి.. లండన్​తో​ రాహుల్​ లవ్​ అఫైర్​.. సెంచరీలతో జోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.