ETV Bharat / sports

IPL 2022: స్వదేశంలోనే ఐపీఎల్.. ఆ రెండు రాష్ట్రాల్లో మ్యాచ్​లు!

author img

By

Published : Jan 30, 2022, 12:25 PM IST

IPL 2022 in maharashtra
ఐపీఎల్​ 2022 వేదిక

IPL 2022 venue: ఐపీఎల్​లను స్వదేశంలోని నిర్వహించాలని బోర్డు సన్నాహాలు చేస్తోందని తెలిసింది. లీగ్​ మ్యాచ్​లను మహారాష్ట్రలో, ప్లేఆఫ్స్​ను గుజరాత్​లో నిర్వహించాలని భావిస్తున్నట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

IPL 2022 venue: దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది. ఈసారి ఐపీఎల్‌ను పూర్తిగా మహారాష్ట్ర, గుజరాత్​లో నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని క్రికెట్​ వర్గాలకు చెందిన ఓ ప్రతినిధి చెప్పారు. "లీగ్​ దశ​ను మహారాష్ట్రలో, ప్లేఆఫ్స్​ను అహ్మదాబాద్​లో(గుజరాత్​) నిర్వహించాలని బోర్డు చర్చలు జరుపుతోంది" అని ఆయన పేర్కొన్నారు.

లీగ్​స్టేజ్​ను ముంబయిలోని వాంఖడే మైదానం, క్రికెట్​ క్లబ్​ ఆప్​ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో ఉన్న బ్రాబోర్న్​ స్టేడియం, నేవీ ముంబయిలో డీవై పాటిల్​ స్టేడియం, పుణె దగ్గర్లో ఉన్న మహారాష్ట్ర క్రికెట్​ అసోసియేన్​ మైదానంలో.. ప్లేఆఫ్స్​ను అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

"ఐపీఎల్​.. సీసీఐలో నిర్వహిస్తారని ఆశిస్తున్నాను, మేము ఆతిథ్యం ఇవ్వడాన్ని సంతోషంగా భావిస్తాం" అని సీసీఐ అధ్యక్షుడు ప్రేమల్​ ఉదాని చెప్పారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్రలోని ఆంక్షల కారణంగా స్టేడియం సామర్థ్యంలో 25 లేదా 50 శాతం ప్రేక్షకులను మాత్రమే ఈ మెగాటోర్నీకి అనుమతిస్తామని ఇటీవలే ప్రకటించారు.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

క్రికెట్ మ్యాచ్​ మధ్యలో స్వల్ప భూకంపం.. చివరకు!?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.