టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీకి బైక్లంటే చాలా ఇష్టం. అతడి గ్యారెజీలో బైక్ల కోసం ప్రత్యేకంగా ఓ షెడ్ కూడా ఉంది. అందులో రకరకాల బైక్లు ఉంటాయి. తాజాగా ఈ క్రికెటర్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్పై రాంచీ స్టేడియానికి వచ్చాడు. ఆ స్టేడియంలో ప్రాక్టీసు చేస్తున్న ధోనీ.. రోజు అదే బైక్పై వస్తున్నట్లు సమాచారం. బైక్పై వెళ్తున్న ధోనీని ఓ అభిమాని తన కెమెరాలో చిత్రీకరించాడు. దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
టీమ్ఇండియా కెప్టెన్గా, వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోనీ వేసిన ప్రణాళికలు, ఆచరణలో పెట్టిన విధానం, కుర్రాళ్లను నడిపిన తత్వం భారత క్రికెట్ను ఆగ్రస్థానంలో నిలబెట్టాయి. అందుకే అతడికి క్రికెట్ అభిమానులు నీరాజనం పడతారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఈ ప్లేయర్.. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. వచ్చే ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే ధోనీ ప్రాక్టీసు కోసం రోజు బైక్పై రాంచీ స్టేడియానికి వచ్చి వెళ్తున్నాడు. కాగా, రాబోయే ఐపీఎల్ ధోనీకి చివరిదని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">