ETV Bharat / sports

సోషల్​ మీడియాలో అత్యంత ఆదరణ గల ఐపీఎల్ జట్టేదో తెలుసా?

author img

By

Published : Mar 7, 2022, 6:38 PM IST

social media followers
ipl 2022

IPL 2022: ఐపీఎల్​ పేరు చెప్పగానే క్రికెట్​ అభిమానులకు ఎక్కడలేని ఆసక్తి, ఉత్తేజం పుట్టుకొస్తుంది. ప్రతి మ్యాచ్​ను అభిమానులు ఎంతో ఉత్కంఠతో చూస్తారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్​ లీగ్​ మార్చి 26న ప్రారంభం కానుంది. అన్ని ఫ్రాంచైజీలు సోషల్​ మీడియాలో చురుగ్గా ఉంటూ తమ ఫ్యాన్స్​కు అప్డేట్స్​ ఇస్తున్నాయి. మరి సోషల్​మీడియాలో ఏ ఫ్రాంచైజీకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

IPL 2022: ఐపీఎల్​ అంటేనే అటు క్రీడాభిమానులకు, ఇటు ఆటగాళ్లకు భలే మజా. ఈ లీగ్​లో ప్రతి ఫ్రాంచైజీ కప్​ గెలవడానికే పరితపిస్తుంటుంది. అభిమానులు చాలా ఆసక్తిగా మ్యాచ్​లను తిలకిస్తారు. 2008లో ఐపీఎల్​ ప్రారంభమైనా.. ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. అప్పటి నుంచి అభిమానులు ప్రతి ఏటా లీగ్​ కోసం ఎదురుచూస్తుంటారు.

ఐపీఎల్​ మొదలయ్యాక క్రికెటర్లు సోషల్​ మీడియా ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యారు. ఐపీఎల్​ ఫ్రాంచైజీలకు సంబంధించిన అధికారిక సోషల్​ మీడియా ఖాతాలను ఆయా జట్ల అభిమానులు అనుసరిస్తున్నారు. తమ అభిప్రాయాల్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. దీంతో ఐపీఎల్​ జట్లకు సంబంధించిన సోషల్​ మీడియా అకౌంట్స్​లో ఫాలోవర్లు విపరీతంగా పెరిగారు. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​లను అన్ని ఫ్రాంచైజీలు బాగా ఉపయోగిస్తున్నాయి. సోషల్​ మీడియాలో ఏ ఐపీఎల్​ ఫ్రాంచైజీకి ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

1. చెన్నై సూపర్​ కింగ్స్​

సీఎస్​కే అంటే ధోని. ధోని అంటే సీఎస్​కే. అత్యధిక సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరిన ఈ జట్టు నాలుగుసార్లు కప్పు గెలుచుకుంది. ధోని వెన్నెముకగా ఉన్న ఈ జట్టుకే సోషల్​ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు 31 మిలియన్ల మంది అభిమానులు ఈ జట్టును అనుసరిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ జట్టు ఫాలోవర్స్ ఇలా ఉన్నారు.

  • ఫేస్​బుక్​- 13 మిలియన్లు
  • ఇన్​స్టాగ్రామ్​- 9.6 మిలియన్లు
  • ట్విట్టర్​- 8.2 మిలియన్లు
  • మొత్తం- 30.8 మిలియన్లు
    ipl 2022
    చెన్నై సూపర్​కింగ్స్​

2. ముంబయి ఇండియన్స్​

ఐపీఎల్​లో అత్యధిక సార్లు కప్పు గెలిచిన రికార్డు ఈ జట్టు సొంతం. ఇప్పటివరకు ఐదు సార్లు కప్పు కైవసం చేసుకుంది. మొదట్లో సచిన్ సారథ్యం వహించగా ఆ తర్వాత రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి జట్టు దాదాపు ప్రతిసారి ప్లే ఆఫ్​ చేరుతోంది. సీఎస్​కే తర్వాత ముంబయి ఇండియన్స్​కే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు. ఆ వివరాలు..

  • ఫేస్​బుక్​- 13 మిలియన్లు
  • ఇన్​స్టాగ్రామ్​- 9 మిలియన్లు
  • ట్విట్టర్​- 7.3 మిలియన్లు
  • మొత్తం- 29.3 మిలియన్లు
    ipl 2022
    ముంబయి ఇండియన్స్​

3. కోల్​కతా నైట్​రైడర్స్​

ఇప్పటివరకు రెండుసార్లు ఐపీఎల్ కప్పు గెలుచుకున్న కోల్​కతాకు సామాజిక మాధ్యమాల్లో 23.6 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.

  • ఫేస్​బుక్​- 16 మిలియన్లు
  • ఇన్​స్టాగ్రామ్​- 2.9 మిలియన్లు
  • ట్విట్టర్​- 4.7 మిలియన్లు
  • మొత్తం- 23.6 మిలియన్లు
    ipl 2022
    కోల్​కత్తా నైట్​రైడర్స్​

4. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

అన్నీ బాగున్నా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పుగెలవని జట్టు ఆర్​సీబీ. గత సీజన్​ వరకు విరాట్​ కోహ్లీ సారథ్యం వహించిన ఈ జట్టుకు ఈ సీజన్​ నుంచి కొత్త కెప్టెన్ రానున్నాడు. మూడుసార్లు ఫైనల్​ వరకూ వెళ్లినా.. ఒక్కసారి కూడా కప్పును ముద్దాడలేకపోయింది ఈ ఫ్రాంచైజీ. ఈ జట్టుకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య ఇలా ఉంది..

  • ఫేస్​బుక్​- 9.8 మిలియన్లు
  • ఇన్​స్టాగ్రామ్​- 8.1 మిలియన్లు
  • ట్విట్టర్​- 5.5 మిలియన్లు
  • మొత్తం- 23.4 మిలియన్లు

5. పంజాబ్​ కింగ్స్​

పంజాబ్ కింగ్స్​ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. ఒకేసారి ఫైనల్​ చేరింది. ఈ జట్టుకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఇలా ఉన్నారు.

  • ఫేస్​బుక్​- 8.6 మిలియన్లు
  • ఇన్​స్టాగ్రామ్​- 2.5 మిలియన్లు
  • ట్విట్టర్​- 2.7 మిలియన్లు
  • మొత్తం- 13.8 మిలియన్లు

6. దిల్లీ క్యాపిటల్స్​

దిల్లీ క్యాపిటల్స్ ఒకే ఒక్కసారి ఫైనల్ చేరింది. ఈ జట్టుకు కూడా ఐపీఎల్ ట్రోఫి అందని ద్రాక్షగానే ఉంది. ఈ ఫ్రాంచైజీకి 13 మిలియన్ల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.

  • ఫేస్​బుక్​- 7.8 మిలియన్లు
  • ఇన్​స్టాగ్రామ్​- 3 మిలియన్లు
  • ట్విట్టర్​- 2.2 మిలియన్లు
  • మొత్తం- 13 మిలియన్లు
    ipl 2022
    దిల్లీ క్యాపిటల్స్​

7. సన్​రైజర్స్​ హైదరాబాద్​

సన్​రైజర్స్ హైదర్​బాద్​ ఒక్కసారి కప్పు గెలిచింది. ఈ జట్టుకు 11.6మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

  • ఫేస్​బుక్​- 6.1 మిలియన్లు
  • ఇన్​స్టాగ్రామ్​- 2.6 మిలియన్లు
  • ట్విట్టర్​- 2.9 మిలియన్లు
  • మొత్తం- 11.6 మిలియన్లు

8. రాజస్థాన్​ రాయల్స్​

ఐపీఎల్ టోర్నీ మొదటి ఎడిషన్లోనే ఛాంపియన్​గా నిలిచింది ఈ జట్టు. ఎలాంటి అంచనాల్లేకుంగా దిగి కప్పు కైవసం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్​ను సోషల్ మీడియాలో దాదాపు 9 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

  • ఫేస్​బుక్​- 4.8 మిలియన్లు
  • ఇన్​స్టాగ్రామ్​- 2.2 మిలియన్లు
  • ట్విట్టర్​- 1.9 మిలియన్లు
  • మొత్తం- 8.9 మిలియన్లు

9. లఖ్​నవూ సూపర్​జియంట్స్​

ఈ జట్టుకు ఇదే తొలి సీజన్​. సోషల్ మీడియాలో 1.1 మిలియన్ల మందికిపైగా అభిమానులున్నారు. కేఎల్​ రాహుల్ ఈ ప్రాంఛైజీకి కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

  • ఫేస్​బుక్​- 166.6 K
  • ఇన్​స్టాగ్రామ్​- 572 K
  • ట్విట్టర్​- 448 K
  • మొత్తం- 1.1 మిలియన్లు

10. గుజరాత్​ టైటాన్స్​

గుజరాత్​ టైటాన్స్ కూడా తొలిసారి ఐపీఎల్​లో పాల్గొంటోంది. టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ ఫ్రాంచైజీకి అతి తక్కువగా 3లక్షల 73వేల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు.

  • ఫేస్​బుక్​- 49.5 K
  • ఇన్​స్టాగ్రామ్​- 241 K
  • ట్విట్టర్​- 83.3 K
  • మొత్తం- 373.8 K

ఇదీ చదవండి: IPL 2022: ఐపీఎల్​ షెడ్యూల్​ వచ్చేసింది.. ఫస్ట్​ మ్యాచ్​ ఇదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.