ETV Bharat / sports

ఐపీఎల్​లో మిగతా జట్లలానే చెన్నై కూడా: రోహిత్

author img

By

Published : Sep 19, 2020, 4:02 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

చెన్నై సూపర్​కింగ్స్​తో మ్యాచ్ అంటే ఎప్పుడు మజానే అని చెప్పిన రోహిత్ శర్మ.. అన్ని జట్లలానే చెన్నై కూడా ఒకటని అన్నాడు.

rohit
రోహిత్​

మరికాసేపట్లో ఐపీఎల్​ సందడి షురూ కానుంది. అబుదాబిలో చెన్నై, ముంబయి మధ్య తొలి మ్యాచ్. ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్​ అంటే చాలు.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చెన్నైతో మ్యాచ్​పై ముంబయి జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగిలిన ఫ్రాంచైజీల్లానే సీఎస్కే కూడా ఒకటని అన్నాడు. ముంబయి ఇండియన్స్ ట్విట్టర్​లో పోస్ట్ చేసిన వీడియోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.​

rohit
రోహిత్​ శర్మ

"సీఎస్కేకు వ్యతిరేకంగా ఆడటమంటే ఎప్పుడూ మజానే. ఆ పోటీని ఎంతో బాగా ఆస్వాదిస్తాం. అయితే, గేమ్​ ఆడే సమయంలో మిగిలిన ప్రాంచైజీల్లాగే సీఎస్కే కూడా. అలానే మేం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం"

రోహిత్​ శర్మ, ముంబయి కెప్టెన్​

ఐపీఎల్​ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో చెన్నై, ముంబయి జట్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉటాయి. సీఎస్కే ఇప్పటివరకు మూడు సార్లు టైటిల్​ గెల్చుకోగా, ముంబయి నాలుగు సార్లు ట్రోఫీ కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. బయో సెక్యూర్​ విధానంలో ప్రేక్షకులు లేకుండానే జరగనుంది.

rohit
ధోనీ, రోహిత్​
Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.