ETV Bharat / sports

ఐపీఎల్​: మరో కొత్త రికార్డుకు చేరువలో రోహిత్​

author img

By

Published : Oct 6, 2020, 6:53 PM IST

Updated : Oct 7, 2020, 8:46 AM IST

ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్​ శర్మ మరో రికార్డు సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం రాజస్థాన్​తో జరగనున్న మ్యాచ్​లో 86 పరుగులు చేస్తే.. ముంబయి తరఫున లీగ్​ కెరీర్​లో 4వేల పరుగుల మార్కును చేరుకుంటాడు.

Rohit Sharma
రోహిత్ శర్మ

ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 86 పరుగులు చేస్తే.. ఐపీఎల్​లో ముంబయి తరఫున 4 వేల పరుగుల మార్కును చేరుకుంటాడు. మంగళవారం రాజస్థాన్​ రాయల్స్​తో జరగనున్న మ్యాచ్​లో ఈ మైలురాయిని అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు రోహిత్​. అంతకుముందు డెక్కన్​ ఛార్జర్స్​ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహించాడు హిట్​మ్యాన్​.

ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్​ల్లో సమంగా చెరో పది గెలిచాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ముంబయి జట్టు బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు రాబిన్​ ఉతప్ప, ఉనద్కత్ పేలవ ప్రదర్శన, స్టోక్స్​ క్వారంటైన్​లో ఉండటం రాజస్థాన్​కు ఆందోళన కలిగించే విషయం.

వరుసగా రెండు విజయాలతో దూసుకెళ్తోన్న ముంబయి.. ఈ మ్యాచ్​లో రాజస్థాన్​ను ఓడించి హ్యాట్రిక్​ కొట్టాలని చూస్తోంది. మరి ఎవరి వ్యూహం ఫలించనుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Last Updated : Oct 7, 2020, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.