ETV Bharat / sports

గల్లీ క్రికెటర్లకు మహత్తర అవకాశం- మార్చిలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్​ లీగ్, ప్లేయర్ల ఎంపిక అప్పుడే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 7:57 AM IST

Updated : Dec 11, 2023, 8:56 AM IST

Indian Street Premier League Date : గల్లీ క్రికెటర్లకు మహత్తర అవకాశం వచ్చింది. మార్చిలో ఇండియన్ స్ట్రీట్​ ప్రీమియర్ లీగ్​ తొలి ఎడిషన్ జరగనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఆసక్తి కలిగిన ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన చెప్పారు.

Indian Street Premier League Date
Indian Street Premier League Date

Indian Street Premier League Date : ఇండియన్ స్ట్రీట్​ ప్రీమియర్​ లీగ్- ఐఎస్​పీఎల్​ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు సెలక్షన్​ కమిటీ హెడ్​ జతిన్ పరంజమే తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో నిర్వహించే ఈ టోర్నీలో ఎంపికి ప్రక్రియ 2024 జనవరి చివరి వారంలో జరుగుతుందని తెలిపారు. అందులో దాదాపు 350 మంది క్రికెటర్లను షార్ట్​లిస్ట్​ చేస్తామని చెప్పారు. అన్ని వయసుల వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు తలుపులు తెరిచి ఉన్నాయని అన్నారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే వారు తమ టెన్నిస్​ బాల్​ క్రికెట్​ నైపుణ్యాలను వీడియోల ద్వారా ప్రదర్శించవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆదివారం హైదారాబాద్​లోని ఓ హోటల్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ISPL T10 : ఈ ఐఎస్​పీఎల్​ను దేశవాళీ, ఇంటర్​నేషనల్​ క్రికెట్​కు భిన్నంగా గ్రేస్‌ బాల్‌కు బదులు టెన్నిస్‌ బాల్‌తో నిర్వహిస్తున్నామని జతిన్ తెలిపారు. కానీ ఫార్మట్‌ మొత్తం ఐపీఎల్‌ మాదిరిగానే ఉంటుందని చెప్పారు. ఈ టోర్నీలో రాణించిన వారికి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అవకాశాలు లభిస్తాయన్నారు. మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ ఆమ్రే నేతృత్వంలో క్రీడాకారుల సెలెక్షన్ జరుగుతుందని తెలిపారు. వేలం ద్వారా ఒక్కో ప్లేయర్​కు రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షల ధర పలుకుతుందని వెల్లడించారు.

టీ10 ఫార్మాట్​లో జరగనున్న ఈ టోర్నీకి టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మెంటార్​గా ఇప్పటికే నియమితులయ్యారు. జతిన్ పరంజమేతో పాటు ప్రవీణ్‌ ఆమ్రే కూడా సెలక్షన్​ కమిటీ హెడ్​గా ఉన్నారు. బీసీసీఐ కోశాధికారి ఆశిశ్​ షెలార్, ముంబయి క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు ఆమోల్ కాలే కోర్​ కమిటీ మెంబర్లుగా ఉన్నారు.

Indian Street Premier League Registration : ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్​లు జరగనున్నాయి. ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్​లోని అన్ని మ్యాచ్ లు క్రికెట్ మైదానంలో జరుగుతాయి. ఐఎస్​పీఎల్ తొలి ఎడిషన్​లో ఆరు మహానగరాలు హైదరాబాద్​, ముంబయి, కోల్​కతా, శ్రీనగర్, బెంగళూరు, చెన్నై నుంచి ఆరు టీమ్​లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ టోర్నీ దేశంలో తొలి టీ10 టెన్నిస్​ బాల్​ లీగ్​ కావడం గమనార్హం. ఆసక్తి కలిగిన ప్లేయర్లు ఐఎస్​పీఎల్ అధికారికి వెబ్​సైట్​ www.ispl-t10.com వెళ్లి రూ.999 రిజిస్ట్రేషన్​ ఫీజు కట్టి వారి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

కీపర్ ప్యాడ్​లో చిక్కుకున్న బంతి- డేంజర్​గా మారిన పిచ్- క్రికెట్​లో విచిత్ర సంఘటనలు

తొలి మ్యాచ్​ వర్షార్పణం - టాస్ పడకుండానే మ్యాచ్​ రద్దు

Last Updated :Dec 11, 2023, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.