ETV Bharat / sports

India vs nz t20: మూడో టీ20 టికెట్ల కోసం అభిమానుల గొడవ!

author img

By

Published : Nov 21, 2021, 2:04 PM IST

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈడెన్ గార్డెన్స్​లో(Eden gardens match) మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​ జరగనుంది. ఆదివారం ఇండియా, న్యూజిలాండ్​ మూడో టీ20(India vs new zealand t20) ఈ మైదానం వేదికగా నిర్వహించనున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ స్టేడియంలో కూర్చుని, క్రికెట్ పండగను వీక్షిద్దామా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అయితే.. అదే సమయంలో కొంతమంది మాత్రం అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణమేంటంటే?

Eden Gardens
ఈడెన్ గార్డెన్స్​

కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​.. క్రికెట్​ అభిమానులకు ఈ పేరు ఓ ఎమోషన్​. ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​లకు వేదికగా నిలిచిన ఈ మైదానంతో(Eden gardens match) ఫ్యాన్స్​కు విడదీయరాని అనుబంధం ఉంటుంది. కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా బోసిపోయిన ఈ గ్రౌండ్​లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ సందడి మొదలవనుంది. ప్రేక్షకులు స్టేడియంలో కూర్చుని మ్యాచ్​ను ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. న్యూజిలాండ్​తో మూడో టీ20(Third t20 ind vs nz)... ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం(నవంబరు 21) జరగనుంది.

ఈడెన్ గార్డెన్స్​లో చివరగా 2019 నవంబరులో బంగ్లాదేశ్​, భారత్​ తొలి పింక్​ బాల్​/డే-నైట్​ టెస్టు జరిగింది. అప్పటి నుంచి ఈ మైదానంలో మరో​ మ్యాచ్​ జరగలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం మ్యాచ్​ను చూసేందుకు అభిమానులు తెగ ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే.. బంగాల్ ప్రభుత్వం కూడా ఈ స్టేడియంలో 70 శాతం సీటింగ్ సామర్థ్యానికి అనుమతినిచ్చింది.

కానీ, వారు మాత్రం..

అయితే.. టికెట్ల కొనుగోలు ప్రక్రియ మొత్తం ఆన్​లైన్​లోనే నిర్వహించడంపై.. కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్​ చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు.. కౌంటర్ల వద్ద టికెట్ల దొరకకపోడవం(Eden gardens ticket booking) వల్ల నిరాశకు లోనవుతున్నారు.

"యాప్​లో టికెట్లు బుక్ చేసుకోవడం తెలియని వారి పరిస్థితి ఏంటి? మ్యాచ్​ చూసే 70 శాతం మందికి ఆన్​లైన్​లో టికెట్లు బుక్​ చేసుకోవడం తెలుస్తుందా? మునపటిలా కొన్ని టికెట్లను ఆఫ్​లైన్​లో కూడా అందించాల్సి ఉండాల్సింది" అని గణేశ్​ అనే ఓ క్రికెట్ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫర్హాద్​ అనే మరో అభిమాని కూడా ఇదే తరహాలో ఆవేదన చెందాడు. "నా చిన్నప్పటి నుంచి నేను కౌంటర్లలో టికెట్లు కొంటున్నాను. ఇప్పుడు ఆకస్మాత్తుగా అంతా ఆన్​లైన్​లో అమ్మడం మొదలుపెట్టారు. ఆన్​లైన్​లో చూస్తే టికెట్లు ఏం లేవు. ఇప్పుడు మేం ఇంట్లో కూర్చుని టీవీలో మ్యాచ్​ చూడాలి" అని చెప్పాడు.

ఈడెన్ గార్డెన్​లో 68 వేల సీటింగ్ సామర్థ్యం ఉంది. 70 శాతం సీటింగ్​కు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో భారత్-న్యూజిలాండ్ మూడో టీ20ని చూసేందుకు దాదాపు 47,600 మంది హాజరవనున్నారని అంచనా.

టీ20 ప్రపంచకప్​లో ఎదురైన ఓటమి నుంచి తేరుకుంటూ.. సొంతగడ్డపై కివీస్​తో జరిగిన రెండు టీ20ల్లో వరుస విజయాలు అందుకుంది టీమ్ ఇండియా. ఆదివారం జరిగే మ్యాచ్​లోనూ నెగ్గి, ప్రత్యర్థిని వైట్​వాష్​ చేయాలని భావిస్తోంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.