ETV Bharat / sports

IND vs NZ: 'కెప్టెన్​గా రోహిత్​ అరుదైన తప్పిదం చేశాడు'

author img

By

Published : Nov 18, 2021, 3:40 PM IST

న్యూజిలాండ్​తో (India Vs New Zealand) జరిగిన మ్యాచ్​లో కెప్టెన్​గా తొలిసారి పూర్తి స్థాయి బాధ్యతలు అందుకున్న రోహిత్​ శర్మ.. జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్​లో హిట్​మ్యాన్​(Rohit Sharma News) ఓ అరుదైన తప్పిదం చేశాడని అన్నాడు వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా.

రోహిత్‌ శర్మ
rohit sharma news

న్యూజిలాండ్‌తో (Ind vs NZ) జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (Rohit Sharma News).. కెప్టెన్సీ పరంగా ఒక అరుదైన తప్పిదం చేశాడని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు (Aakash Chopra News). బుధవారం(నవంబరు 17) రాత్రి జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌పై ఆకాశ్‌ తన యూట్యూబ్‌ ఛానల్లో విశ్లేషణ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

venkatesh iyer news
వెంకటేశ్ అయ్యర్

"టీమ్‌ఇండియా ఇంతకుముందు ఆరో బౌలర్‌ కావాలని చెప్పిన నేపథ్యంలోనే ఈ మ్యాచ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ను ఆడించారు. కానీ, అతడికి బౌలింగ్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇది రోహిత్‌శర్మ కెప్టెన్సీలో చాలా అరుదైన తప్పిదమని నేను భావిస్తా. సహజంగా అతడి నాయకత్వం బాగుంటుంది. కానీ, వెంకటేశ్‌కు బౌలింగ్‌ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు"

-ఆకాశ్‌ చోప్రా, వ్యాఖ్యాత

"రోహిత్‌ (Aakash Chopra Rohit Sharma) టాస్‌ గెలిచాక అతడిని బౌలింగ్‌కు తీసుకురావాల్సింది. ఆదిలోనే కివీస్‌ ఒక వికెట్‌ కోల్పోయి తడబడుతున్న వేళ వెంకటేశ్‌ చేత రెండు, మూడు ఓవర్లు వేయించాల్సింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసిన దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ సిరాజ్‌ ఎక్కువ పరుగులిచ్చిన నేపథ్యంలో అతడిని కూడా ఉపయోగించుకోవాల్సింది. మరోవైపు సీనియర్‌ బౌలర్లు భువనేశ్వర్‌, అశ్విన్‌ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేసి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా భువి బౌలింగ్‌లో రాణించడం విశేషం. వాళ్లిద్దరూ తమ అనుభవంతో పొదుపుగా బౌలింగ్‌ చేశారు" అని ఆకాశ్ తన అభిప్రాయాలు తెలిపాడు.

తొలి మ్యాచ్​ భారత్​దే..

జైపూర్​ వేదికగా తొలి టీ20లో(IND vs NZ t20 series 2021) న్యూజిలాండ్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

సూర్యకుమార్‌ యాదవ్‌ (62), కెప్టెన్‌ రోహిత్ శర్మ (48) రాణించారు. తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్ (15)తో కలిసి రోహిత్ అర్ధశతక భాగస్వామ్మం నిర్మించాడు. రాహుల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మరో అర్ధశతకం (59) జోడించారు.

రోహిత్ ఔటైనప్పటికీ సూర్యకుమార్‌ ధాటిగానే బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో మూడో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అయితే దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్‌ కివీస్‌ బౌలర్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. రిషభ్‌ పంత్ 12*, శ్రేయస్‌ అయ్యర్ 5, వెంకటేశ్‌ అయ్యర్ 4 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, సౌథీ, డారిల్ మిచెల్, సాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి: భయపెట్టేలా చూసిన భారత క్రికెటర్.. రూ.లక్ష సొంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.