ETV Bharat / sports

భారత్​ ఆట తీరుపై రోహిత్ శర్మ స్పందన

author img

By

Published : Dec 6, 2020, 11:00 PM IST

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​ నెగ్గడంపై భారత బ్యాట్స్​మన్ రోహిత్ శర్మ, మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్​ స్పందించారు. జట్టు ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు.

Rohith Sharma
భారత్​ ఆట తీరు హర్షనీయం: రోహిత్ శర్మ

టీమ్​ఇండియా బాట్స్​మన్​ రోహిత్​ శర్మ... ఆస్ట్రేలియాపై భారత్ టీ20 సిరీస్​ 2-0తో నెగ్గడంపై హర్షం వ్యక్తం చేశాడు. జట్టు సభ్యులను కొనియాడుతూ ట్వీట్​ చేశాడు.

" భారత్​ ఆడిన తీరు అద్భుతం. సిరీస్​ నెగ్గడం ఆనందంగా ఉంది. ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు " అని రోహిత్​ ట్విట్టర్​లో పేర్కొన్నాడు.

  • What a series win for Team India. Loved the way they played nice and composed. Big 👍 to each one of them. @BCCI

    — Rohit Sharma (@ImRo45) December 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గాయం కారణంగా భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్​ శర్మ ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో రోహిత్​ మొదటి సారి భారత జట్టు ఆట తీరుపై స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ కైవసం

మజా ఆగయా....

భారత మాజీ బ్యాట్స్​మన్ వీరేంద్ర సెహ్వాగ్​ కూడా భారత్​ సిరీస్​ నెగ్గడంపై హర్షం వ్యక్తం చేశాడు. శిఖర్​ ధావన్ ఆరంభంలో బాగా ఆడాడని, హార్దిక్​ ముగింపు అద్భుతం అని పేర్కొన్నాడు. నటరాజన్​ బౌలింగ్​ తీరు బాగుందని తెలిపాడు. ఆటను చూస్తుంటే మజా వచ్చిందని ట్వీట్ చేశాడు.

ఇదీ చదవండి:'రోహిత్​, బుమ్రా లేకపోయినా సిరీస్​ గెలిచాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.