ETV Bharat / sports

విండీస్​తో టీ20 సిరీస్​కు భారత జట్టు ఇదే.. కోహ్లీ, బుమ్రా దూరం

author img

By

Published : Jul 14, 2022, 2:50 PM IST

virat kohli
విరాట్​ కోహ్లీ

IND vs WI T20 Squad: విండీస్​ పర్యటనకు టీమ్​ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యుల బృందం గల ఈ జట్టులో విరాట్​ కోహ్లీ, బుమ్రాలకు స్థానం దక్కలేదు. వారికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు బోర్డు పేర్కొంది.

IND vs WI T20 Squad: వెస్టిండీస్​తో జరగనున్న టీ20 సిరీస్​కు టీమ్​ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్​ సారథ్యంలో జరగనున్న ఈ సిరీస్​కు విరాట్​ కోహ్లీ, బుమ్రాలు దూరం కానున్నారు. గత కొన్నాళ్లు ఫామ్​ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్​కు ఈ సిరీస్​కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో కేఎల్​ రాహుల్​ ఆడే అవకాశం ఉంది. అయితే ఇటీవల సర్జరీ చేయించుకున్న రాహుల్​ ఈ సిరీస్​లో ఆడటం అతడి ఫిట్​నెస్​పైన ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. తీరిన లేకుండా క్రికెట్​ ఆడుతున్న బుమ్రాకు కూడా రెస్ట్​ ఇస్తున్నట్లు తెలిపింది. జట్టులో చోటు దక్కించుకున్న మరో ఆటగాడు కుల్​దీప్​ యాదవ్​ను కూడా ఫిట్​నెస్​ చూసి తుదిజట్టులో చోటుకల్పిస్తామని పేర్కొంది.

విండీస్​ పర్యటనకు టీమ్​ఇండియా జట్టు ఇదే: రోహిత్​ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్​ రాహుల్, సూర్యకుమార్​ యాదవ్, దీపక్​ హుడా, శ్రేయస్​ అయ్యర్, దినేశ్​ కార్తిక్​, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్సర్​ పటేల్, బిష్ణోయ్, అశ్విన్​, కుల్​దీప్​ యాదవ్, భువనేశ్వర్​ కుమార్, ఆవేశ్​ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్​ సింగ్.

ఇదీ చూడండి : వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్​ వన్​.. టీ20లో 5వ స్థానానికి సూర్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.