ETV Bharat / sports

టీ20 రికార్డుకు చేరువలో కోహ్లీ, రోహిత్​!

author img

By

Published : Feb 18, 2022, 3:57 PM IST

IND vs WI 2nd T20: టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ, మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. ఓ టీ20 రికార్డుకు చేరువలో ఉన్నారు. విండీస్​తో రెండో టీ20లో ఆ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

IND vs WI 2nd T20
రోహిత్​-కోహ్లీ

IND vs WI 2nd T20: తొలి టీ20లో విండీస్​పై టీమ్​ఇండియా ఘన విజయంతో అభిమానులు రెండో టీ20కి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్​ అభిమానులకు, ముఖ్యంగా రోహిత్​-కోహ్లీ అభిమానులకు ప్రత్యేకమయ్యే అవకాశం ఉంది. వీరిద్దరూ ఓ టీ20 రికార్డుకు చేరువలో ఉండటమే ఇందుకు కారణం. ఈ టీ20తో వీరిద్దరిలో ఒకరు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా నిలవనున్నారు. ప్రస్తుతం అగ్రస్థానంలో 3299 పరుగులతో కివీస్​ ఆటగాడు మార్టిన్​ గప్తిల్ కొనసాగుతున్నాడు.

ఎన్ని పరుగులు చేయాలంటే?

కెప్టెన్​ రోహిత్​ శర్మ ఈ రికార్డును అందుకోవాలంటే మరో 63 పరుగులు చేయాల్సి ఉంది. తన కెరీర్​లో ఇప్పటివరకు 120 టీ20లు ఆడిన రోహిత్​ 33 సగటుతో 3237 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ ​సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్​లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు రోహిత్​ పేరునే ఉంది.

విరాట్​ కోహ్లీ ఈ రికార్డు చేరుకోడానికి 56 పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 96 టీ20​లు ఆడిన కోహ్లీ 51 సగటుతో 3244 పరుగులు చేశాడు. ఇందులో 29 హాఫ్​సెంచరీలు ఉన్నాయి.

విండీస్​పై తొలి టీ20లో వేగవంతమైన ఇన్నింగ్స్​ ఆడిన రోహిత్​ ఈ రికార్డును అందుకుంటాడో.. లేక రన్​మెషీన్​ విరాట్​ కోహ్లీ ఫామ్​లోకి వచ్చి ఈ రికార్డును బద్దలు కొడతాడో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి : Virat Kohli: కోహ్లీ ఇలాంటి రిస్క్​ ఎప్పుడూ తీసుకోలేదు: చోప్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.