ETV Bharat / sports

లంకను క్లీన్​స్వీప్​ చేసిన టీమ్​ ఇండియా.. రోహిత్​ సేన రికార్డు

author img

By

Published : Feb 27, 2022, 10:30 PM IST

Updated : Feb 28, 2022, 7:31 AM IST

IND vs SL 3rd T20: మూడో టీ20లోనూ టీమ్​ఇండియా.. శ్రీలంకపై ఘన విజయం సాధించింది. శ్రేయస్​ అయ్యర్​ ధనాధన్​ ఇన్నింగ్స్​తో 16.5 ఓవర్లలోనే జట్టు లక్ష్యాన్ని ఛేదించింది.

shreyas iyer
టీమ్​ఇండియా ఘన విజయం.. లంక క్లీన్​స్వీప్​

IND vs SL 3rd T20: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లోనూ టీమ్​ఇండియా విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్​ దక్కించుకున్న భారత్​ ఈ విజయంతో శ్రీలంకను క్లీన్​స్వీప్​ చేసింది. యువక్రికెటర్​ శ్రేయస్​ అయ్యర్​ దూకుడుగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్​ బాదిన శ్రేయస్​.. 45 బంతుల్లో 73 పరుగులు చేశాడు. మరోవైపు జడేజా కూడా చక్కని భాగస్వామ్యం అందించడం వల్ల 16.5 ఓవర్లలోనే 147 పరుగుల లక్ష్యాన్ని టీమ్​ఇండియా ఛేదించింది.

శ్రేయస్​ అయ్యర్​ ఈ సిరీస్​లో వరుసగా మూడు హాఫ్​సెంచరీలు (57*, 74*, 73*) సహా మొత్తంగా 204 పరుగులు చేశాడు.

టీమ్​ఇండియా రికార్డు..

ఈ విజయంతో రోహిత్​ సేన అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక విజయాలు నమోదు చేసిన అఫ్గానిస్థాన్​ జట్టు సరసన చేరింది. అఫ్గాన్​.. వరుసగా 12 టీ20ల్లో గెలిచింది.

ఇదీ చూడండి : ఆ రెండు జట్ల మధ్యే ఐపీఎల్​ తొలి మ్యాచ్​.. ప్రేక్షకులకు ఓకే!

Last Updated : Feb 28, 2022, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.