ETV Bharat / sports

ఐసోలేషన్​లో పంత్, సాహా.. డీకే ఆసక్తికర ట్వీట్​

author img

By

Published : Jul 16, 2021, 1:39 PM IST

ఇంగ్లాండ్​ పర్యటన వేళ కొవిడ్​ కారణంగా ఇద్దరు టీమ్​ఇండియా వికెట్ కీపర్లు రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా ఐసోలేషన్​లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరో కీపర్ దినేశ్ కార్తీక్ చేసిన ఓ ట్వీట్​ వైరల్​గా మారింది.

Dinesh Karthik
​రిషభ్​ పంత్

కరోనా కారణంగా ఇంగ్లాండ్​లో పర్యటిస్తున్న టీమ్​ఇండియా వరుస అవాంతరాలను ఎదుర్కొంటోంది. యువ వికెట్​కీపర్- బ్యాట్స్​మన్​ రిషభ్​ పంత్ వైరస్​ బారిన పడగా, సహాయ సిబ్బందిలో పాజిటివ్​గా తేలిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న కారణంగా మరో కీపర్​ వృద్ధిమాన్ సాహా ఐసోలేషన్​లో ఉన్నాడు. వీరిద్దరూ 5 మ్యాచ్​ల టెస్టు సిరీస్​కు అందుబాటులో లేకపోతే ఇక కీపర్​గా మిగిలింది కేఎల్​ రాహుల్​ మాత్రమే.

ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర ట్వీట్​ చేశాడు దినేశ్​ కార్తీక్. ప్రసార సిబ్బందిలో(కామెంటేటర్​) భాగంగా ఇంగ్లాండ్​లోనే ఉన్న తను.. ఓ అవకాశం ఇస్తే కీపింగ్​ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతమిచ్చాడు. అందుకు సూచనగా తన గ్లోవ్స్​తో పాటు క్రికెట్​ కిట్​ను ట్విట్టర్​లో షేర్​ చేశాడు. కాగా, ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

ఇదీ చూడండి: Rishabh Pant: పంత్​ను వెనకేసుకొచ్చిన దాదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.