ETV Bharat / sports

ఐపీఎల్ హక్కులకు రూ.33వేల కోట్లు.. మ్యాచ్ టైమింగ్స్​లో మార్పులు!

author img

By

Published : May 19, 2022, 12:12 PM IST

IPL News
ఐపీఎల్ హక్కులకు రూ.33వేల కోట్లు.. మ్యాచ్ టైమింగ్స్​లో మార్పులు!

IPL News: ఐపీఎల్​ మ్యాచ్​లను వచ్చే సీజన్​ నుంచి మళ్లీ సాయంత్రం 4, రాత్రి 8 గంటలకే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఈమేరకు ప్రసార సంస్థలకు స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే వచ్చే ఐదేళ్ల పాటు ఐపీఎల్ టీవీ, ఓటీటీ ప్రసార హక్కుల ధరను రూ.32.8వేల కోట్లుగా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

IPL Match Timings: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ మ్యాచ్​ల టైమింగ్స్ మారనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ మునుపటి లాగే సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకు మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్​ మొదటి 10 సీజన్ల మ్యాచ్​లు ఈ టైమింగ్స్​లోనే జరిగాయి. అయితే ప్రస్తుతం ఐపీఎల్​ మ్యాచ్​లు సాయంత్రం 3:30 గంటలకు, రాత్రి 7:30 గంటలకే జరుగుతున్నాయి. వ్యూవర్​షిప్ కోసం అరగంట ముందే మ్యాచ్​లు నిర్వహించాలని స్టార్​స్పోర్ట్స్​ కోరడం వల్లే బీసీసీఐ ఇందుకు అనుమతిచ్చింది. అయితే ఈ ఏడాదితో ఐపీఎల్ బ్రాడ్​కాస్టింగ్ హక్కుల గడువు ముగుస్తోంది. దీంతో 2023-27 వరకు ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బీసీసీఐ మళ్లీ బిడ్లకు ఆహ్వానిస్తోంది. అయితే ఈసారి మ్యాచ్​లు సాయంత్రం 4, రాత్రి 8గంటలకే ప్రసారం చేయాలని బిడ్​లో పాల్గొనాలనుకే సంస్థలకు బీసీసీఐ ముందుగానే స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిడ్​లో పాల్గొనే సంస్థలు ఐటీ డాక్యుమెంట్లు కొనుగోలు చేసేందుకు బీసీసీఐ మే 20వరకు గడువు ఇచ్చింది. అయితే దీన్ని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది.

రూ.32.8 వేలకోట్లు: వచ్చే ఐదేళ్ల పాటు ఐపీఎల్​ ప్రసార హక్కుల ధరను బీసీసీఐ రూ.32,890కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీవీ, డిజిటల్ రైట్స్​(ఓటీటీ) కలుపుకొని ఇంత మొత్తాన్ని ఫైనల్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్టార్ ఇండియా, వయాకామ్ 18, సోనీ, అమెజాన్​, జీ, డ్రీమ్​ 11, సూపర్​స్పోర్ట్స్​, స్కై సంస్థలు ఇప్పటివరకు ఐటీ డాక్యుమెంట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరి వీటిలో చివరకు ఏ సంస్థ ఐపీఎల్ హక్కులను దక్కించుకుంటుందో చూడాలి.

ఇదీ చదవండి: ' క్రీడల విషయంలో తల్లిదండ్రుల వైఖరి ఇంకా మారాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.