ETV Bharat / sports

కోహ్లీకి ట్రోల్స్ బెడద.. ఇంగ్లాండ్​ ప్రేక్షకుల అత్యుత్సాహం​

author img

By

Published : Aug 8, 2021, 8:44 AM IST

నాటింగహమ్​ వేదికగా భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో నాలుగో రోజు ఇంగ్లాండ్​ ప్రేక్షకులు విరాట్​ కోహ్లీపై ట్రోల్స్​ చేశారు. టీమ్​ఇండియా రివ్యూలను వృథా చేసుకోవడం వల్ల దానిని అవకాశంగా తీసుకుని వ్యంగాస్త్రాలు సంధించారు.

virat kohli
విరాట్​ కోహ్లీ

రివ్యూలు తీసుకునే విషయంలో టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీకి చెత్త రికార్డే ఉంది. తాజాగా.. ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో అది కొనసాగింది. ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​లో ఉన్న మూడు రివ్యూలను వృథా చేసుకోవడం వల్ల కీలక సమయంలో వాటిని జట్టు ఉపయోగించుకోలేకపోయింది. ఇక ఇదే అదనుగా.. కోహ్లీపై ఇంగ్లాండ్​ ప్రేక్షకులు ట్రోల్స్​ చేశారు.

ఇదీ జరిగింది..

అంపైర్​ నిర్ణయంపై సమీక్ష కోరేందుకు టీమ్​ కెప్టెన్​ రివ్యూ కోరే అవకాశముంటుంది. అయితే అది ఇన్నింగ్స్​లో కేవలం మూడుసార్లకే పరిమితం. ఇందుకు.. చేతులతో సైగలు చేయాల్సి ఉంటుంది.

ఇక తొలి టెస్టు నాలుగో రోజు.. రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగింది ఇంగ్లాండ్​ జట్టు. ఈ క్రమంలో ఉన్న రివ్యూలన్నీ వెంటవెంటనే వాడేశాడు కోహ్లీ. అవన్నీ వృథాగా పోవడం ఆందోళనకర విషయం. వాస్తవానికి రివ్యూలు చాలా కీలకం. సరైన సమయంలో వినియోగించుకుంటే మ్యాచ్​ మలుపు తిరిగే అవకాశముంది. కానీ ఉన్న మూడింటినీ వృథా చేసుకున్న టీమ్​ఇండియా.. ఆ తర్వాత అవసరమైనప్పుడు ఉపయోగించుకోలేకపోయింది. ఫలితంగా ఇంగ్లాండ్​ మంచి స్కోర్​ను సాధించగలిగింది.

అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. స్టేడియంలో ఉన్న ఇంగ్లాండ్​ ప్రేక్షకులు రివ్యూల విషయంలో విరాట్​ను విపరీతంగా ట్రోల్​ చేశారు. బంతి, బ్యాట్స్​మన్​ కాళ్లకి(ఎల్​బీడబ్ల్యూ) తాకినప్పుడు 'రివ్యూ ఇవ్వు' అన్నట్టుగా చేతులతో సైగలు చేశారు. ఇవి స్టేడియంలోని కెమెరాలకు చిక్కగా..ఇప్పుడు అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

నాటింగ్​హామ్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో విజయానికి 157 పరుగుల దూరంలో ఉంది టీమ్​ఇండియా. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 52/1​ పరుగులు చేసింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 303 పరుగులకు ఆలౌటైంది.

ఇదీ చూడండి:- జడేజా ఖాతాలో మరో ఘనత.. ఆ జాబితాలో 5వ స్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.