ETV Bharat / sports

Ind vs Eng: ఆఖరి టెస్టుకు షమి.. రోహిత్​, పుజారా డౌటే!

author img

By

Published : Sep 9, 2021, 5:30 AM IST

Shami fit to play in Manchester; medical team monitoring Rohit, Pujara
ఆఖరి టెస్టుకు షమీ.. వైద్యుల పర్యవేక్షణలో రోహిత్​, పుజారా

ఇంగ్లాండ్​తో ఐదో టెస్టు కోసం షమికి ఛాన్స్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాయాలతో బాధపడుతున్న రోహిత్ శర్మ, పుజారా.. ఈ మ్యాచ్​ కోసం అందుబాటులో ఉంటారా లేదో చూడాలి.

టీమ్ఇండియా​ పేసర్​ మహ్మద్​ షమి గాయం నుంచి కోలుకున్నాడు. మాంచెస్టర్​లో ఇంగ్లాండ్​తో(Ind vs Eng) నిర్ణయాత్మక ఐదో టెస్టులో(Manchester Test) అతడు ఆడే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం టీమ్​ఇండియా ప్రాక్టీస్​ సెషన్​లో షమి కూడా పాల్గొన్నాడు. ఇతడితో పాటు సీనియర్​ పేసర్​ ఇషాంత్​ శర్మనూ చివరి మ్యాచ్​ కోసం పరిశీలించే అవకాశం ఉంది.

రాబోయే రెండు నెలల్లో ఐపీఎల్​తో పాటు టీ20 ప్రపంచకప్​(ICC T20 Worldcup) దృష్టిలో ఉంచుకుంటే.. చివరి టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చి, ఆ స్థానంలో షమిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

రోహిత్​, పుజారా ఆడతారా?

నాలుగో టెస్టులో గాయపడిన భారత బ్యాట్స్​మెన్​ రోహిత్​ శర్మ, పుజారాలను మెడికల్ టీమ్​ పర్యవేక్షిస్తుంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఆఖరి టెస్టులో వీరిద్దరూ అందుబాటులో ఉంటారో లేదో చూడాలి.

ప్రస్తుతం రోహిత్ శర్మ ఫిట్​గానే ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా నిర్ణయం మాత్రం మెడికల్​ బృందంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అఖరి మ్యాచ్​కు రోహిత్​ శర్మ ఫిట్​నెస్(Rohit Injury)​ సాధించకపోతే.. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్​, మయాంక్​ అగర్వాల్​, పృథ్వీషాను పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు పుజారా కూడా గాయం(Pujara Injury) నుంచి కోలుకోని పరిస్థితుల్లో హనుమ విహారి లేదా సూర్య కుమార్​ యాదవ్​కు ఛాన్స్​ ఇస్తారు.

నిర్ణయాత్మక పోరు కోసం..

ఇంగ్లాండ్​తో జరుగుతున్న 5 మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 2-1తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు సెప్టెంబరు 10న చివరి మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​లో కోహ్లీసేన నెగ్గినా.. డ్రా చేసుకున్నా సిరీస్​ కైవసం చేసుకుంటుంది. ఇందులో ఇంగ్లాండ్​ గెలిస్తే సిరీస్​ డ్రాగా ముగుస్తుంది.

ఇదీ చూడండి.. ఐపీఎల్​లో ఎయిర్​ అంబులెన్స్​- 30 వేల RT-PCR​ కిట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.