ETV Bharat / sports

'మూడో టెస్టుకు జట్టులో మార్పు ఉండదు'

author img

By

Published : Aug 24, 2021, 7:59 PM IST

Updated : Aug 24, 2021, 8:26 PM IST

ఇంగ్లాండ్​తో రెండో టెస్టు గెలిచిన జట్టుతోనే మూడో టెస్టు మ్యాచ్​ ఆడనున్నట్లు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ తెలిపాడు. జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు.

India vs England
మూడో టెస్టుకు జట్టు మార్పు ఉండదు

ఇంగ్లాండ్​తో జరగనున్న మూడో టెస్టుకు జట్టులో ఎలాంటి మార్పు ఉండదని టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ తెలిపాడు. లార్డ్స్​ వేదికగా జరిగిన రెండో టెస్టులో 151 పరుగులతో ఘన విజయం సాధించిన టీమ్​తోనే బరిలోకి దిగుతామని చెప్పాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని భావిస్తున్నామని.. అందుకే 'విన్నింగ్​ కాంబినేషన్'ను మార్చాలని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు.

"జట్టులో మార్పులు చేయడానికి ఎలాంటి కారణాలు లేవు. కొద్ది రోజులుగా అందరూ స్థిరంగా ఆడుతున్నారు. అందుకే విన్నింగ్ కాంబినేషన్‌ని మార్చాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా" అని కోహ్లీ చెప్పాడు.

"అతిథ్య జట్టులో బెన్​ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వంటి స్టార్​ ఆటగాళ్లు లేకపోవడం భారత్​కు కలిసొచ్చే అంశం కదా.. ఇది సిరీస్​ను కైవసం చేసుకోవడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారా?" అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. కోహ్లీ ఘాటుగా బదులిచ్చాడు.

"అది ప్రత్యర్థి బలం మీద ఆధారపడి ఉంటుంది? కీలక ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు కూడా ఎవరినైనా ఓడించగలమని భావిస్తాం. ప్రత్యర్థి బలహీనమయ్యే వరకు వేచి ఉండం" అని పేర్కొన్నాడు.

ప్రస్తుతం 1-0తో ఆధిక్యంతో ఉత్సాహంతో ఉన్న టీమ్​ఇండియా.. ఆగస్టు 25న లీడ్స్ వేదికగా మూడో టెస్టుకు సన్నద్ధమవుతోంది.

ఇదీ చూడండి: మూడో టెస్టుకు అందుబాటులో భారత స్టార్ పేసర్!

Last Updated : Aug 24, 2021, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.