ETV Bharat / sports

Icc News: టీ20 ప్రపంచకప్​లో ఇదే తొలిసారి

author img

By

Published : Oct 10, 2021, 3:17 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) నిర్ణయ సమీక్ష విధానాన్ని ప్రవేశపెట్టనుంది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC News). ఒక ఇన్నింగ్స్​లో ప్రతి జట్టుకు గరిష్టంగా రెండు రివ్యూలు తీసుకునే వీలును కల్పిస్తుంది.

T20 World Cup 2021
టీ 20 ప్రపంచకప్ 2021

అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) నిర్ణయ సమీక్ష విధానంను(DRS Rules in T20) ప్రవేశపెట్టనున్నారు. టీ20ల్లో డీఆర్​ఎస్​ అమలుకు(DRS rules) అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ICC News) ఆమోదం తెలిపింది. ప్రతి జట్టుకు ఒక ఇన్నింగ్స్‌లో గరిష్టంగా రెండు రివ్యూలు అందుబాటులో ఉంటాయి. గతంలో వన్డేల్లో ప్రతి జట్టుకు ఒక ఇన్నింగ్స్‌లో ఒక డీఆర్​ఎస్​, టెస్టుల్లో 2 డీఆర్​ఎస్​లు అమలులో ఉండేవి.

అయితే కొవిడ్‌ కారణంగా అనుభవజ్ఞులైన అంపైర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఆసంఖ్యను వన్డేల్లో ప్రతి జట్టుకు ఒక ఇన్నింగ్స్‌లో రెండు డీఆర్​ఎస్​లు, టెస్టుల్లో 3 రివ్యూ​లకు ఐసీసీ పెంచింది. దుబాయ్‌, ఒమన్‌వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ అక్టోబర్‌ 17న ప్రారంభమై నవంబర్‌ 14న ముగియనుంది.

ఇదీ చదవండి:T20 World Cup 2021: టీమ్​ఇండియాలో ఉమ్రాన్​కు చోటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.