ETV Bharat / sports

ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కొవిడ్ పాజిటివ్

author img

By

Published : Nov 26, 2020, 11:06 AM IST

సిరీస్ కోసం కివీస్​ దేశం చేరుకున్న పాక్​ క్రికెటర్లలో ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్​లో ఉన్నారు.

Six members of Pakistan squad in New Zealand test positive for COVID-19
ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కొవిడ్ పాజిటివ్

న్యూజిలాండ్​ పర్యటనకు వెళ్లిన ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ట్వీట్ చేసింది. ప్రస్తుతం వారంతా క్రైస్ట్​చర్చ్​లోని ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపింది.

టూర్​లో భాగంగా డిసెంబరు 10 నుంచి మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి కివీస్-పాక్. అంతకంటే ముందు వెస్టిండీస్​తో రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది న్యూజిలాండ్ జట్టు. ఈ శుక్రవారం రెండుజట్ల మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది.

pak cricketers
పాక్ క్రికెటర్లు(పాత ఫొటో)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.